కేరళ రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ తెలిపారు.
Vijaya Sai Reddy Comments on Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. గురువారం నాడు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా పడవ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ తాజాగా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఎవరైనా కొట్టుకుపోతుంటే పరామర్శకు వెళ్లినోళ్లు వరద నీటిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాలి. మీరే జారి నీళ్ళలో పడితే ఎలా బాబూ? పబ్లిసిటీ కోసం రెండు అడుగుల నీటిలో…
అంగన్వాడీ టీచర్లతో ప్రత్యేకంగా మాట్లాడి.. పిల్లలంతా సర్కారు బడులకు వచ్చేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సర్పంచ్ల నుంచి మొదలుకుని మంత్రుల వరకు అందరినీ బడిబాటలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య, పాఠశాల విద్యార్థుల గత విజయాలను వివరించి పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని మంత్రి వివరించారు. బషీర్బాగ్లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల డీఈవోలతో బడిబాట కార్యక్రమంపై మంత్రి వీడియోకాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా…
ఈరోజుల్లో పబ్లిసిటీలో కొత్త పుంతలు కనిపిస్తేనే కస్టమర్లను ఆకట్టుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకానీ పాతచింతకాయ పచ్చడిలా ప్రకటనలు ఇస్తే చూస్తే రోజులు పోయాయి. అందుకే వ్యాపార సంస్థలు ట్రెండ్ను ఫాలో అవుతున్నాయి. తమ బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతకైనా తెగిస్తున్నాయి. అమూల్ సంస్థ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తోంది. ఇటీవల కోక్ ఇష్యూను తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకున్న అమూల్.. ఇప్పుడు ఏకంగా ఓ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తమ…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చిత్ర పరిశ్రమను కలిచివేసింది. జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురైన పునీత్ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఒక పక్క ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకులేక ఆత్మహత్యలు చేసుకొంటుంటే.. మరోపక్క కొంతమంది డబ్బుకోసం ఆయన మృతిని ప్రచారం కింద వాడుకుంటున్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేసినట్లే తెలుపుతూ.. దాని కింద వారి వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. పునీత్ మరణాన్ని కొన్ని డయాగ్నోస్టిక్స్ క్యాష్ చేసుకుంటున్నాయి.…