CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం.. మే 15 నుంచి ప్రారంభం..
- జాబ్ ఫస్ట్ అనేది ఏపీ ప్రభుత్వ నినాదం..
- మే 15 నుంచి నోటిఫికేషన్లు..
- 10,060 పోస్టులను భర్తీ చేస్తామన్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ‘జాబ్ ఫస్ట్’ నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
ఉద్యోగాల భర్తీ షెడ్యూల్..
Also Read
- Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
మే 15, 2026 నుంచి అక్టోబర్ 15, 2026 మధ్య కాలంలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల కాలంలోనే ప్రభుత్వ , ప్రైవేటు రంగాల్లో కలిపి సుమారు 6 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించినట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపన ద్వారా ప్రైవేటు రంగంలో ఈ ఏడాది మరిన్ని లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Also Read:Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను ముమ్మరం చేసి, ప్రతిభతో ఉద్యోగాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం గురించి చర్చించారు. అధికారులు అందించిన ప్రాథమిక అంచనాలను పరిశీలించిన సీఎం, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలని, త్వరితగతిన నివేదికలు అందజేయాలని అధికారులను సూచించారు. రైతులకు అండగా నిలవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
-
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!