https://youtu.be/OhCCLSb_rV8 అవును.. శ్రీలంకలో అదే జరుగుతోంది. ఆనాడు రామాయణంలో హనుమంతుడు లంకను తగులబెట్టాడని అంటారు. చూసి రమ్మంటే కాల్చివచ్చాడంటారు. కానీ ఇప్పుడు లంకలో ఆ దేశ ప్రజలే హింసకు పాల్పడుతున్నారు. అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు.. ఎవరి ఇళ్ళను వదిలిపెట్టడం లేదు. ఎంపీలు, మాజీ మంత్రుల ఇళ్లకు ఆందోళనకారులు సాయంత్రం నిప్పు పెట్టారు. సోమవారం నాడు మధ్యాహ్నం ప్రధాని రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కూడా ఆందోళనలు సద్దుమణగలేదు. కొలంబోలో శాంతియుతంగా…
పెట్రో ధరలు మంట మండుతున్నాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రో ధరలకు బ్రేక్ పడినా.. ఆ తర్వాత 16 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను వడ్డిస్తూ వచ్చాయి చమురు సంస్థలు.. దీంతో.. పెట్రోల్ కొట్టించాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. డీజిల్ పోయించాలంటే.. లెక్కలు వేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది.. అయితే, ఓ పెట్రోల్ బంక్ యజమానికి నచ్చిన నేత పుట్టిన రోజు రావడంతో.. స్థానికులకు బంపరాఫర్ ఇచ్చాడు.. రూపాయికే లీటర్ పెట్రోల్ అందించాడు.. అయితే, దానికి వెనుక…
రైతు పడించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే సేకరించాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ లోని లక్ష్మీ గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి, జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ దేశములో పండే ప్రతి వరి గింజను కొనాలని ఉంది. కానీ…
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ మేనియా పట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకావడంతో ఈ మూవీని చూడాలని అభిమానులు ఉత్సాహంగా వున్నారు. అయితే థియేటర్ యజమానులకు ప్రభుత్వం షాకిచ్చింది. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు వేయడానికి అవకాశం లేదని, అలా కాదని బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే సినిమాటోగ్రఫీ చట్టం కింద కేసులు నమోదుచేస్తామని రెవిన్యూ అధికారులు స్పష్టం చేయడంతో థియేటర్ యజమానులు దిక్కుతోచక అల్లాడుతున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో భీమ్లా నాయక్ సినిమాకు ఆటంకాలు ఏర్పడ్డాయి.…
కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది.. మొన్నటివరకూ హిజాబ్ వ్యవహారం హీట్ పుట్టించగా…. ఇప్పుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కలకలం రేపుతోంది.. దీంతో శివమొగ్గ ఉద్రిక్తంగా మారింది. ఈ హత్య రాజకీయంగాను పెను సంచలనం సృష్టించింది. హత్యవెనక శివకుమార్ ఉన్నారని మంత్రి ఈశ్వరప్ప ఆరోపించగా.. దీని వెనక ఉన్నవారిని ఉరితీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా హత్య జరిగిన శివమొగ్గ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి చేజారకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే…
ఏపీ ప్రభుత్వంలోని పలు శాఖలలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు ఉద్యమాలు ఆపేది లేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల…
కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంపై చిచ్చు రేపుతోంది.. రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై నిషేధం విధించడం రచ్చగా మారింది.. ఈ నేపథ్యంలో బెంగళూరులోని విద్యా సంస్థల దగ్గర సమావేశాలు, నిరసనలపై రెండు వారాల పాటు నిషేధం విధించారు.. హిజాబ్ వ్యవహారంలో వరుస నిరసనల నేపథ్యంలో.. తరగతి గదుల్లో హిజాబ్ ధరించే హక్కుపై మితవాద గ్రూపులు ముస్లిం బాలికలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించడంతో కర్ణాటకలో నిరసనలు తీవ్రమయ్యాయి.. ఇది కాస్తా ఇతర కళాశాలలకు వ్యాపించాయి… కర్నాటకలోని…
కెనడాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. వ్యాక్సిన్ను తప్పనిసరి చేయడంతో పాటుగా భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. నిబంధనలకు కఠినంగా అమలు చేస్తుండటంతో అక్కడి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. దేశంలో ఓ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నిబంధనలను మరింత కఠినం చేయడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ట్రక్ డ్రైవర్లు వేలాది ట్రక్కులతో…
కజికిస్తాన్లో చమురు ధరల రగడ తారాస్థాయికి చేరింది. గత కొంతకాలంగా చమురు ధరలను అక్కడి ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. దీంతో ఆ దేశంలోని అనేక నగరాల్లో ప్రజలు, ఆందోళనకారులు రోడ్డుమీదకు వచ్చి నిరసనలు చేశారు. పోలీసులు నిరసనలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనలు పెద్దవి కావడంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి. Read: కరోనాకు వయాగ్రా ఔషదం: కోమా నుంచి కోలుకున్న మహిళ……
ఢిల్లీ శివారులో సుదీర్ఘ కాలంగా సాగుతోన్న రైతు సంఘాల ఆందోళన తాత్కాలికంగా వాయిదా పడింది.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు.. రైతుల ఇతర డిమాండ్లపై కూడా సానుకూలంగా ఉండడం.. కనీస మద్దతు ధరపై పాజిటివ్గా ఉండడంతో.. ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి లేఖ వచ్చిందన్నారు బీకేయూ నేత రాకేష్ టికాయత్… ఇక, ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని లేఖలో ఉందని…