వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా అధికారులు నిరసన చేపట్టారు. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి.. జీవిత ఖైదు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. పరిగి నియోజకవర్గంలోని తహసిల్దార్ కార్యాలయాలను మూసివేసి నిరసన తెలుపుతూ తహశీల్దారులు, రెవెన్యూ సిబ్బంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు.
ఉదయం నుండి సాయంత్రం వరకు బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసిన అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్ లతో కలిసి నీలోఫర్ కేఫ్ కు వచ్చారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్న, డిమాండ్ చేస్తున్నాం పేదల ఇండ్లను కూల్చోద్దు అని ఆయన అన్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మూసీ సుందరీకరణ ను తెర మీదకు తెచ్చారని, సిగ్గులేకుండా ప్రభుత్వం పేద ప్రజల ఇండ్లను కూల్చుతోందన్నారు కిషన్ రెడ్డి.
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. బెటాలియన్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న భర్తల కోసం భార్యలు ధర్నాకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో హాట్ కామెంట్స్ చేశారు. నేను ఎందుకు బ్రతకడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తాను అని వెల్లడించారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై మరోసారి ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూనియర్ వైద్యులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి మద్దతుగా మంగళవారం 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు. తాజాగా ఈ సంఖ్య మరింత పెరుగుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు కార్మిక సంఘాల నేతల వెల్లడించారు. వారం రోజుల్లో బయోమెట్రిక్ విధానం పునరుద్ధరణ చేస్తామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డకునేందుకు ప్రత్యక్ష ఆందోళనలు మొదలయ్యాయి. నిత్యం కార్మికులు, ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. గత శనివారం ఉన్నట్టుండి 4200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయాన్నే ప్లాంట్ వద్దకు కుటుంబ సభ్యులతో సహ చేరుకున్న కార్మికులు ఈడీ ఆఫీసును ముట్టడించారు. కొద్దిసేపు ఆ ప్రాంతం నిరసనలతో, నినాదాలతో దద్దరిల్లి పోయింది.
మూడున్నర ఏళ్లుగా కార్మికుల చేతుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. స్టీల్ ప్లాంట్ మనగడసాగించాలన్నా.. మూతపడాలన్న వచ్చే ఆరు నెలలు అత్యంత కీలకమైన సమయంగా ప్రజాసంఘాలు భావిస్తున్నాయి.