Jeevan Reddy: నీకో దండం.. నీ పార్టీకో దండం.. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
- విప్ అడ్లూరి లక్ష్మణ్తో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి హాట్ కామెంట్స్..
- నీకో దండం.. నీ పార్టీకో దండం అంటూ ఘాటు వ్యాఖ్యలు..
- కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నాను: జీవన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురి అయ్యాడు. ఈ కేసులో పోలీసుల అదుపులో నిందుతుడు సంతోష్ తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో నిందితుడిని ఉంచినట్టు తెలుస్తుంది. ఇక, నిందితుడు నుంచి హత్యకు గల కారణాలు, హత్య వెనక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కాంగ్రెస్ సీరియన్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ హత్యకు నిరసనగా రోడ్డుపై బైటాయించి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Read Also: Blast In Factory: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పది మందికి పైగా తీవ్ర గాయాలు
Also Read
- Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
- Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
- Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
- KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
ఈ సందర్భంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో హాట్ కామెంట్స్ చేశారు. నేను ఎందుకు బ్రతకడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తాను అని వెల్లడించారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నాను.. నీకు నీ పార్టీకో దండం.. మమ్మలి ఇలా బ్రతకనివ్వండి అంటూ విప్ లక్ష్మణ్ తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొర పెట్టుకున్నారు. అలాగే, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా నేను పార్టీలో ఉండలేను నన్ను క్షమించండి అని జీవన్ రెడ్డి తెలిపారు. నాలుగు దశబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. మహేష్ గౌడ్ మాట్లాడుతుండాగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోన్ కట్ చేసి విసిరేశారు.
Read Also: CWG 2026: కామన్వెల్త్ క్రీడల నుంచి 9 గేమ్స్ ఔట్.. లిస్ట్లో క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్!
అయితే, మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటికి వెళ్లి అన్ని రహదారులను పోలీసులు మూసి వేశారు. కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీస్ పహారా కొనసాగుతుంది. ఈ సందర్భంగా జగిత్యాల ఎస్పీకి ఎమ్మెల్యే సంజయ్ ఫోన్ చేశారు. మారు గంగారెడ్డి హత్య పై ఆరా తీశారు. నింధితులను కఠినంగా శిక్షించాలని, హత్యలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.
తాజావార్తలు
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!