Jeevan Reddy: నీకో దండం.. నీ పార్టీకో దండం.. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
- విప్ అడ్లూరి లక్ష్మణ్తో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి హాట్ కామెంట్స్..
- నీకో దండం.. నీ పార్టీకో దండం అంటూ ఘాటు వ్యాఖ్యలు..
- కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నాను: జీవన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురి అయ్యాడు. ఈ కేసులో పోలీసుల అదుపులో నిందుతుడు సంతోష్ తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో నిందితుడిని ఉంచినట్టు తెలుస్తుంది. ఇక, నిందితుడు నుంచి హత్యకు గల కారణాలు, హత్య వెనక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కాంగ్రెస్ సీరియన్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ హత్యకు నిరసనగా రోడ్డుపై బైటాయించి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Read Also: Blast In Factory: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పది మందికి పైగా తీవ్ర గాయాలు
Also Read
ఈ సందర్భంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో హాట్ కామెంట్స్ చేశారు. నేను ఎందుకు బ్రతకడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తాను అని వెల్లడించారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నాను.. నీకు నీ పార్టీకో దండం.. మమ్మలి ఇలా బ్రతకనివ్వండి అంటూ విప్ లక్ష్మణ్ తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొర పెట్టుకున్నారు. అలాగే, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా నేను పార్టీలో ఉండలేను నన్ను క్షమించండి అని జీవన్ రెడ్డి తెలిపారు. నాలుగు దశబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. మహేష్ గౌడ్ మాట్లాడుతుండాగానే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోన్ కట్ చేసి విసిరేశారు.
Read Also: CWG 2026: కామన్వెల్త్ క్రీడల నుంచి 9 గేమ్స్ ఔట్.. లిస్ట్లో క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్!
అయితే, మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటికి వెళ్లి అన్ని రహదారులను పోలీసులు మూసి వేశారు. కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి హత్య నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీస్ పహారా కొనసాగుతుంది. ఈ సందర్భంగా జగిత్యాల ఎస్పీకి ఎమ్మెల్యే సంజయ్ ఫోన్ చేశారు. మారు గంగారెడ్డి హత్య పై ఆరా తీశారు. నింధితులను కఠినంగా శిక్షించాలని, హత్యలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!