Telangana: తెలంగాణలో రోడ్డెక్కిన పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు.. ఎందుకంటే..?
- రోడ్డెక్కిన బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు
- భర్తల కోసం పోలీస్ బెటాలియన్ల ఎదుట ధర్నా చేసిన భార్యలు
- ఏక్ స్టేట్.. ఏక్ పోలీస్ విధానం కావాలంటూ డిమాండ్
- బెటాలియన్ కానిస్టేబుళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. బెటాలియన్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న భర్తల కోసం భార్యలు ధర్నాకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. టీజీఎస్పీ హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాలను తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటలకు మించి బెటాలియన్ కానిస్టేబుళ్లకు డ్యూటీ వేస్తుండటాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.
నెలలో నాలుగు రోజులు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. తమ భర్తలతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుళ్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వాపోయారు. తరచూ పోస్టింగులు మారుస్తూ ఉండటంతో పిల్లల చదువులకు ఇబ్బంది ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. తమ సమస్యలు పరిష్కారించాలని కానిస్టేబుళ్ల సతీమణులు ధర్నాకు దిగారు. డిచ్పల్లి, హాజీపూర్, సిరిసిల్లలో ఆందోళన చేసిన కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Read Also: Underwater Wedding: సాహసోపేత వివాహం.. ఏకంగా సముద్రం అడుగున జంట పెళ్లి..
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని 7వ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు.. బెటాలియన్ ఎదుట జాతీయ రహదారిపై ధర్నా చేశారు. 8 గంటలకు మించి కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తుండటంతో.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బెటాలియన్ పోలీసులకు ఐదేళ్ల పాటు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కారించాలని డిచ్పల్లిలోని 7వ బెటాలియన్ ఎదుట ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్ల భార్యల ధర్నా చూసి.. అదే మార్గంలో వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆగారు. ఆందోళనకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా.. వారి ధర్నాకు మద్దతు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు రోడ్డెక్కారు. హాజీపూర్ మండలం గుడిపేట టీజీఎస్పీ 13వ పోలీస్ పటాలంలో పని చేసే పోలీసుల భార్యలు రాస్తారోకో చేపట్టారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమ భర్తలు ఇంటికి దూరంగా ఉంటున్నారని… నెలలో నాలుగు రోజులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారని వాపోయారు. ఉద్యోగాల పేరుతో తమకు దూరం చేస్తున్నారని.. ఇకనైనా ఒక రాష్ట్రం, ఒక పోలీస్ విధానం అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?