Telangana: తెలంగాణలో రోడ్డెక్కిన పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు.. ఎందుకంటే..?
- రోడ్డెక్కిన బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు
- భర్తల కోసం పోలీస్ బెటాలియన్ల ఎదుట ధర్నా చేసిన భార్యలు
- ఏక్ స్టేట్.. ఏక్ పోలీస్ విధానం కావాలంటూ డిమాండ్
- బెటాలియన్ కానిస్టేబుళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. బెటాలియన్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న భర్తల కోసం భార్యలు ధర్నాకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. టీజీఎస్పీ హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాలను తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటలకు మించి బెటాలియన్ కానిస్టేబుళ్లకు డ్యూటీ వేస్తుండటాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.
నెలలో నాలుగు రోజులు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. తమ భర్తలతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుళ్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వాపోయారు. తరచూ పోస్టింగులు మారుస్తూ ఉండటంతో పిల్లల చదువులకు ఇబ్బంది ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. తమ సమస్యలు పరిష్కారించాలని కానిస్టేబుళ్ల సతీమణులు ధర్నాకు దిగారు. డిచ్పల్లి, హాజీపూర్, సిరిసిల్లలో ఆందోళన చేసిన కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
Read Also: Underwater Wedding: సాహసోపేత వివాహం.. ఏకంగా సముద్రం అడుగున జంట పెళ్లి..
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని 7వ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు.. బెటాలియన్ ఎదుట జాతీయ రహదారిపై ధర్నా చేశారు. 8 గంటలకు మించి కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తుండటంతో.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బెటాలియన్ పోలీసులకు ఐదేళ్ల పాటు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కారించాలని డిచ్పల్లిలోని 7వ బెటాలియన్ ఎదుట ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్ల భార్యల ధర్నా చూసి.. అదే మార్గంలో వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆగారు. ఆందోళనకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా.. వారి ధర్నాకు మద్దతు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు రోడ్డెక్కారు. హాజీపూర్ మండలం గుడిపేట టీజీఎస్పీ 13వ పోలీస్ పటాలంలో పని చేసే పోలీసుల భార్యలు రాస్తారోకో చేపట్టారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమ భర్తలు ఇంటికి దూరంగా ఉంటున్నారని… నెలలో నాలుగు రోజులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారని వాపోయారు. ఉద్యోగాల పేరుతో తమకు దూరం చేస్తున్నారని.. ఇకనైనా ఒక రాష్ట్రం, ఒక పోలీస్ విధానం అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?