Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pastor Praveen Kumar Post Mortem Complete Ka Paul Taken To Rajahmundry Government Hospital

Pastor Praveen Kumar: పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం పూర్తి.. రాజమండ్రి ఆస్పత్రికి కేఏ పాల్..

Published Date :March 26, 2025 , 4:36 pm
By Sudhakar Ravula
  • పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..
  • కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించిన వైద్యులు..
  • రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి కేఏ పాల్..
  • ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్..
Pastor Praveen Kumar: పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం పూర్తి.. రాజమండ్రి ఆస్పత్రికి కేఏ పాల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pastor Praveen Kumar: పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసింది.. ఆ తర్వాత ప్రవీణ్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు.. దీంతో, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుండి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రవీణ్ డెడ్‌బాడీని తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు.. అయితే, ప్రభుత్వాసుపత్రి పాస్టర్‌ ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకెళ్తుండగా.. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు కొందరు క్రైస్తవులు.. మరోవైపు.. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న కేఏ పాల్.. పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం జరుగుతున్న మార్చురీ వద్దరకు వెళ్లారు.. పోస్టుమార్టం జరుగుతుండగా.. ఆ ప్రక్రియను తానూ పరిశీలిస్తానన్నారు.. కానీ, పోస్టుమార్టం గదిలోకి పాల్ కు అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు..

Read Also: Summer Tips : వేసవిలో టానింగ్ ఉండదు.. ఈ విషయాలను జాగ్రత్తగా పాటిస్తే..!

Also Read

  • CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
  • Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..
  • Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్‌
  • Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ఇక, కేఏ పాల్ రాకతో భారీగా నినాదాలు చేశారు క్రైస్తవులు.. విచారణలో స్పష్టత రాకపోతే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి కేఏ పాల్ డిమాండ్‌ చేశారు.. ప్రవీణ్ మృతిపై అనేకఅనుమానాలు ఉన్నాయి.. నిన్నటి నుంచి ఈ విషయం మీద చాలాసార్లు స్పందించాను.. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రికి మెసేజ్ లు చేశాను. రెస్పాన్స్ రాలేదన్నారు పాల్.. అయితే, పోస్టుమార్టం ముగిసిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించారు కే ఏ పాల్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన ఘటనపై వాస్తవాలను అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.. ఏ రకంగా జరిగిందో ఆధారాలతో సహా వివరించాలన్న ఆయన.. క్రైస్తవ సోదరులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు.. ఇప్పటికీ ఈ విషయంపై సీఎం, హోం మంత్రికి సమాచారం ఇచ్చాను.. అవసరం అయితే.. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు కేఏ పాల్..

Read Also: Nagavamshi : వారంతా హాస్పిటల్ లో చేరితే బిల్లులు నేనే కడుతా : నాగవంశీ

కాగా, తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పీఎస్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ కుమార్‌ ప్రాణాలు విడిచారు.. హైదరాబాద్‌లోని తిరుమలగిరి సమీపంలో నివాసం ఉండే ప్రవీణ్‌.. అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగీకుడిగా కొనసాగుతున్నారు. అయితే, హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై సోమవారం రాత్రి రాజమండ్రి బయల్దేరిన ఆయన.. స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లారు.. ఈ క్రమంలో మార్గమధ్యలో సోమవారం అర్ధరాత్రి మోటార్‌సైకిల్‌ అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లడం.. బైక్‌ కాస్తా ప్రవీణ్‌కుమార్‌పై పడి మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు..బుల్లెట్‌తో సహా ప్రవీణ్‌కుమార్‌ రోడ్డు పైనుంచి కిందికి జారిపోవడం, బుల్లెట్‌ ఆయనపై పడిపోవడంతో మృతిచెందినట్టు పేర్కొన్నారు.. కానీ, ప్రవీణ్‌ కుమార్‌ మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • KA Paul
  • Pastor Praveen Kumar
  • post mortem
  • Rajahmundry Government Hospital..

తాజావార్తలు

  • రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions