Bribe For Post-mortem: పోస్ట్ మార్టం కోసం లంచం… కూలీ కుటుంబానికి వేధింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబందుల గురించి మనం ఎప్పుడో విన్నాం.. శవాలను పీక్కుతినడం మనం చూశాం. కానీ పోస్టుమార్టం చేయడం కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఆసుపత్రి సిబ్బంది ఉదంతం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. నాకే కాదు పైన చాలామందికి ఇవ్వాలి అని అంటున్న సిబ్బంది.. అసలే కొడుకు పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులను లంచం కోసం వేధించారు ఆస్పత్రి సిబ్బంది. రెండువేలు ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు సిబ్బంది. ఫోన్ పే చేయించుకున్న సిబ్బంది పోస్ట్ మార్టం చేశారు. కూలి కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేసిన సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు, మృతదేహాన్ని అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన వైనం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. అశ్వరావుపేటకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల కాపరిగా ఉండే యడ్లపల్లి సురేందర్ తన మొబైల్ ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేయించుకునేందుకు తల్లిని డబ్బులు అడిగాడు. కూలి డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తానని తల్లి చెప్పడంతో మనస్థాపం చెంది అదే రోజు రాత్రి పురుగుల మందు తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబీకులు హుటాహుటిన అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Read Also:Missing Child: బాలిక మిస్సింగ్.. 24 గంటలు గడుస్తున్నా లభించని ఆచూకీ..
కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డ యడ్లపల్లి సురేంద్రకు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది.మృతదేహం కొత్తగూడంకి వచ్చింది కొత్తగూడెం హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. తొలుత మూడువేలు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేశారు. అయితే తమ దగ్గర వెయ్యిరూపాయలు మాత్రమే ఉన్నాయని ఆ వెయ్యి రూపాయలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే తిరస్కరించారు. చివరికి ఫోన్ పే ద్వారా మిగతా అమౌంట్ తన ఖాతాలో వేయించుకున్నారు సిబ్బంది. అయితే ఇది తన ఒక్కడికే కాదని మేము ఇంకా చాలామందికి ఇవ్వవలసి ఉంటుందని ఆ సిబ్బంది చెబుతున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. గురువారం జరిగిందీ ఘటన. దీనిపై వైద్యశాఖ అధికారులు, వైద్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Read Also: Aishwarya: ముగ్గురు పిల్లలకు తల్లి కాబోతున్న ఐశ్వర్య
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!