Bribe For Post-mortem: పోస్ట్ మార్టం కోసం లంచం… కూలీ కుటుంబానికి వేధింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబందుల గురించి మనం ఎప్పుడో విన్నాం.. శవాలను పీక్కుతినడం మనం చూశాం. కానీ పోస్టుమార్టం చేయడం కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఆసుపత్రి సిబ్బంది ఉదంతం తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. నాకే కాదు పైన చాలామందికి ఇవ్వాలి అని అంటున్న సిబ్బంది.. అసలే కొడుకు పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులను లంచం కోసం వేధించారు ఆస్పత్రి సిబ్బంది. రెండువేలు ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు సిబ్బంది. ఫోన్ పే చేయించుకున్న సిబ్బంది పోస్ట్ మార్టం చేశారు. కూలి కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేసిన సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు, మృతదేహాన్ని అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన వైనం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. అశ్వరావుపేటకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల కాపరిగా ఉండే యడ్లపల్లి సురేందర్ తన మొబైల్ ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేయించుకునేందుకు తల్లిని డబ్బులు అడిగాడు. కూలి డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తానని తల్లి చెప్పడంతో మనస్థాపం చెంది అదే రోజు రాత్రి పురుగుల మందు తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబీకులు హుటాహుటిన అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
Read Also:Missing Child: బాలిక మిస్సింగ్.. 24 గంటలు గడుస్తున్నా లభించని ఆచూకీ..
కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డ యడ్లపల్లి సురేంద్రకు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది.మృతదేహం కొత్తగూడంకి వచ్చింది కొత్తగూడెం హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. తొలుత మూడువేలు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేశారు. అయితే తమ దగ్గర వెయ్యిరూపాయలు మాత్రమే ఉన్నాయని ఆ వెయ్యి రూపాయలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే తిరస్కరించారు. చివరికి ఫోన్ పే ద్వారా మిగతా అమౌంట్ తన ఖాతాలో వేయించుకున్నారు సిబ్బంది. అయితే ఇది తన ఒక్కడికే కాదని మేము ఇంకా చాలామందికి ఇవ్వవలసి ఉంటుందని ఆ సిబ్బంది చెబుతున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. గురువారం జరిగిందీ ఘటన. దీనిపై వైద్యశాఖ అధికారులు, వైద్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Read Also: Aishwarya: ముగ్గురు పిల్లలకు తల్లి కాబోతున్న ఐశ్వర్య
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!