అన్నమయ్య జిల్లా రాజంపేటలో యువ దంపతుల్లో భార్య అదృశ్యం అయింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం సీసీ కండ్రిగ గ్రామానికి చెందిన భర్త వెల్లూరు రాజా (22), భార్య పెంచలమ్మ (20).. దీపావళి పండుగ కోసమని అన్నమయ్య జిల్లా చిట్వేలులోని అత్తగారి ఇంటికి వెంకటగిరి నుంచి బయల్దేరారు. అయితే.. రాపూరు బస్టాండ్ నుంచి బస్సులో ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్న ఒక్క అపరిచిత వ్యక్తితో దంపతులు రాజంపేట పాత బస్టాండ్లో దిగారు.
పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో గంజాయిని తరలిస్తున్న ముఠాను కొమురం భీం జిల్లా వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దు దాటే క్రమంలో పోలీసులు చాకచక్యంగా దొరకబట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా జిల్లా ఎస్పీకి సమాచారం వచ్చింది. దీంతో.. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ట్యాంకర్లో ఉన్న సుమారు 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నార పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్ను టీఎస్ఎన్ఏబీ (TSNAB) అధికారులు సీజ్ చేశారు. ఓ కిలేడీ లేడీ.. గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు.
Nadendla Manohar: గుంటూరు జిల్లాలోని తెనాలి ఐతనగర్లో రౌడీ షీటర్ దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకుమాను ఇంద్రజిత్ ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు.
పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విడుదల చేసింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ల బడ్జెట్గా రూ.182.48 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఓ ల్యాండ్ ఇష్యూకు సంబంధించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నంద్యాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. పట్ట లోని సలీమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఫరూక్ ఆటో డ్రైవర్ ఫరూక్.. రైల్వే స్టేషన్ లో ప్రశాంతి ఎక్స్ప్రెస్ కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. రైలు ప్లాట్ఫామ్ మీద ఆగడానికి వస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ ఫరూక్ పట్టాలపైకి దూకాడు. క్షణాల్లో రైలు అతనిపై నుంచి దూసుకెళ్లింది..
నిబంధనలకు విరుద్ధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సంత మార్కెట్లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.. సంతలో మద్యం విక్రయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.. సంతలో ఓ చిన్న బెంచ్లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.. అదికాస్తా వైరల్గా మారడంతో స్పందించిన ఎక్సైజ్, పోలీసు అధికారులు... పరారైన విక్రేతలను ఫోటోలు, వీడియోలు ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు.. ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి, పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో…
విజయవాడలోని ఓ హోటల్కు బాంబు బెదిరింపు వచ్చింది. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలో.. తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏమీ లేదని గుర్తించారు.
ప్రభుత్వ ఉద్యోగికి మాయమాటలు చెప్పి బంగారు ఉంగరంతో దొంగ బాబాలు పరారైన ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శంకర్ కుమార్, తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తక్కల్ల పల్లి, గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దేంది మాధవరెడ్డి, నాగార్జున సాగర్ రోడ్డు తక్కల్లపల్లి గేటు వద్ద నుండి తమ గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ సమయంలోనే తెలుపు రంగు కారులో సాధువుల అవతారం ధరించిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన కవార్నాథ్ మధారి,…