హైదరాబాదులో ప్రముఖులకు కారు చిచ్చు తగిలింది. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న కారులకు భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుండి కారులు దిగుమతి చేసుకునే రాయబారులకు పన్ను నుండి మినహాయిoపు ఉంటుంది. రాయబారులను ఆసరాగా తీసుకుని విచ్చలవిడిగా విదేశాల నుండి కార్లు దిగుమతి చేస్తుంది ముంబై మాఫియా. విదేశాల నుండి వస్తున్న కార్లు ముంబై నుండి మణిపూర్ లో ఓ మారుమూల షో రూంలో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రాయబారులు పేరుతో చెల్లించాల్సిన పన్ను ఎగొట్టెందుకు…
కరోనా వైరస్ ఓ వైపు కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా సైబర్ కేటుగాళ్ల బాధితుల జాబితాలో ఓ 77 ఏళ్ల వృద్ధుడు చేరాడు.. సరదాగా డేటింగ్ అంటూ చాటింగ్తో స్టార్ట్ అయ్యి.. చివరకు రూ.11 లక్షలు పోగుట్టుకున్న తర్వాత గానీ ఆ వృద్ధుడికి తాను చీటింగ్కు గురయ్యాను అనే సంగతి తెలిసిరాలేదు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన ఓ 77 ఏళ్లు వృద్ధుడు..…
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే.. భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి… ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. తమకు సమాచారం చేరినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.. డ్రోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్రపన్నారని వెల్లడించిన ఇంటెలీజెన్స్ బ్యూరో… దేశ రాజధానిలో ‘ఆపరేషన్ జెహాద్’ ను ప్రారంభించడానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. ఆగస్టు 15కు ముందే దాడులకు ప్రణాళికలు వేసినట్టు చెబుతున్నారు.. ఈ ఉగ్రదాడిని అడ్డుకోవడానికి అలర్ట్గా…
గుట్కా నిషేధించటం మంచి విషయమే. కానీ, ఈ నిషేధం సక్రమంగా అమలు కావటం అంత తేలిక కాదు. ఇప్పుడు తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోందట సాక్షాత్తూ పోలీసులే గుట్కా నిషేధానికి తూట్లు పొడుతున్నారట. అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారట.. తయారీకి, రవాణాకు సపోర్ట్ చేస్తున్నారట కొందరు కిందిస్థాయి అధికారులు. తెలంగాణలో గుట్కాని ప్రభుత్వం నిషేధించింది. అమ్మినా కొనుగోలు చేసిన కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తయారీదారులపై కూడా ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గుట్కా తయారు…
నాగోల్ అల్కాపురి లో గల టాటా షో రూమ్ లో మొదటి అంతస్తు నుంచి కారు కిందపడింది. కారును కొనుగోలు చేసింది మేడిపల్లి కి చెందిన భగవత్ అనే వ్యక్తి. మొదటి అంతస్తులో ఉన్న కారును హైడ్రాలిక్ సిస్టం పై కిందికి తీసుకొనివచ్చి కారు కొనుగోలు చేసిన వ్యక్తికి ఇవ్వాలి షోరూమ్ సిబ్బంది. కానీ మొదటి అంతస్తులో ఉన్న కారును భగవత్ నడిపేందుకు షోరూం సిబ్బంది అనుమతి ఇచ్చారు. కారును స్టార్ట్ చేయడం తో హఠాత్తుగా మొదటి…
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి హైదరాబాద్ వచ్చిన జాంబియాకు చెందిన ఓ ప్రయాణికుడి దగ్గర రూ.25 కోట్ల విలువ చేసే 3.2 కేజీల హెరాయిన్ను పట్టుకున్నారు.. సినీ పక్కీలో మాదకద్రవ్యాలను మలద్వారంలో తరలిస్తుండగా.. కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు.. ఇక, 3.2 కిలోల హెరెయిన్ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ మధ్య తరచూ దేశంలోని అంతర్జాతీయ…
కుప్పంలో టెన్షన్ వాతారవరణం నెలకొంది. కుప్పంలో ఇవాళ శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ర్యాలీకి పిలుపునిచారు బలిజ సామాజిక వర్గం నేతలు. కానీ ఆ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని బలిజ సామాజిక వర్గ పెద్దలు ప్రకటించారు. దాంతో గత రాత్రి నుంచి ముఖ్య నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఉంచిన శ్రీ మంజునాథ రెసిడెన్సి వద్ద 50 మందికి పైగా పోలీసులను మోహరించారు.…
నకిలీ డీఎస్పీ దందాలపై పోలీసుల విచారణ ముమ్మరం చేసారు. నిన్న హైదరాబాద్ పోలీసులు ఓ నకిలీ డీఎస్పీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసాడు బీబీపేట మండలం,తులాజ్ పూర్ కి చెందిన నెల్లూరు స్వామి. అయితే తాను ఓ పోలీస్ అధికారిగా చెప్పుకొంటూ సెటిల్ మెంట్లు, వసూళ్లకు పాల్పడినట్లు నిర్దారణ అయ్యింది. పోలీస్ శాఖలో ఎవరు సహకరించారు, అతని వెనుక ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరూ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.…
బిబి పేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన నకిలీ డీఎస్పీ పోలీస్ ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని 5 జిల్లాల్లో 20 మంది నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట కోటి రూపాయలు వసూలు చేసాడు నెల్లూరు స్వామి. డీఎస్పీ డ్రెస్ లో వాహనాన్ని పెట్టుకొని ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం, సెటిల్మెంట్ చేసేవాడు. ఇంటర్మీడియేట్ పాస్ కానీ వ్యక్తి డిఎస్పి కావడమేంటని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆశ్రయించారు బాధితులు. హైదరాబాద్ బేగం…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న…