మహిళలపై జరుగుతోన్నఅఘాయిత్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళంలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంతో పాటు పురుషుల ఆలోచనా ధోరణి మారాలన్నారు.. న్యాయానికి అన్యాయం జరిగినప్పుడు అవుట్ ఆఫ్ లా ఒక్కటే మార్గమని.. బయటికొచ్చి న్యాయం చేయాలన్న ఆయన.. తెలంగాణలో మృగాళ్లను సీపీ సజ్జనార్ వేటాడిన విధానం అద్భుతం.. అందుకే సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను మరోసారి అభినందిస్తున్నట్టు తెలిపారు.. మగాడు సమాజానికి రక్షణ కల్పించాలి… కానీ, మృగంలా మారకూడదన్న ఆయన.. మృగాల్లా వ్యవహరించేవాళ్లను క్షమించకూడదు అన్నారు.
స్త్రీని అగౌరపరచి… మానాన్ని అహరించిన వాడిని ఈ భూమి మీద లేకుండా చేయాలి అంటూ వ్యాఖ్యానించారు ఏపీ స్పీకర్ తమ్మినేని.. అవుటాఫ్ ది లా అమలు చేస్తేనే సమాజంలో సమాంతర న్యాయం సాధ్యమవుతుందన్నారు.. అన్నదమ్ములు , కన్న తండ్రి సైతం ఆడపిల్లల పై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.. అసలు సమాజం ఎటు వైపు వెళ్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాముడు వెలసిన పుణ్యభూమి, కృష్ణుడు పుట్టిన ఖర్మభూమి మనది.. ఏమైంది మన గొప్ప సంస్కృతికి..? మనం ఎలా ఉండాలో చిన్నప్పటి నుంచీ సుమతీ శతకంలో చెప్పారు..? మరోమారు మనం మనల్ని పునఃసమీక్షించుకోవాలని సూచించారు.. మనం రూపొందించుకున్న చట్టాలను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్న తమ్మినేని.. దిశయాప్ ను ఉపయోగించుకుంటూనే సమాజంలో మానసికమైన మార్పును తీసుకురావాలని సూచించారు.