హైదరాబాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. బోయిగూడలోని ఓ స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు.. ఇవాళ తెల్లవారుజామను స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది.. అందులో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు.. ఇద్దరు కార్మికులను ఫైర్ సిబ్బంది కాపాడారు.. ఇక, స్క్రాప్ గోదాం పక్కనే టింబర్ డిపోలు ఉన్నాయి.. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఎనిమిది ఫైర్ ఇంజన్లు.. మంటలను అదుపుచేశాయి.. కానీ, అప్పటికే 11 మంది…
బోధన్ ఇష్యూ ఇప్పుడు చర్చగా మారింది.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బంద్ వరకు వెళ్లింది పరిస్థితి.. దీంతో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. స్థానికేతరులను ఎవ్వరినీ బోధన్లోకి రానివ్వకుండా ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి.. తనిఖీలు చేస్తున్నారు.. అయితే, బోధన్ అల్లర్ల వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని తేల్చారు పోలీసులు.. శివసేనకు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఉన్నట్టుగా గుర్తించారు. Read Also: Muralidhar Rao: తెలంగాణ…
కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ ఆవరణలోని చెట్లు పొదల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించారు. ప్రమాదం కారణంగా యూనివర్శిటీలో పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి మంటలు. బాయ్స్ హాస్టల్ సమీపం నుంచి ఎంబీఏ కాలేజీ ఆవరణం వరకూ విస్తరించాయి మంటలు. శాతవాహన యూనివర్సిటీ లో ఉన్న…
కామాంధులు కన్నుమిన్ను ఎరగకుండా దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు.. ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేస్తున్నా.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా… నిత్యం ఏదో ఒక చోట మాత్రం అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. తాజాగా, ఓ దుర్మార్గుడు.. ఓ మహిళపై కన్నేశాడు.. పొలాల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారం యత్నం చేశాడు.. ఇక, మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. మహిళను కాపాడేందుకు వెళ్లాడు.. ఆమె భర్త.. దీంతో.. బాధితురాలి భర్తపై దాడి చేసిన నిందితుడు.. అతడిని తీవ్రంగా గాయపర్చి.. అక్కడి…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వెళ్తున్న మహేంద్ర థార్ కారు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో బ్రిడ్జి దిగి కొంతదూరం వెళ్లగానే రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నరేళ్ల బాలుడు కిందపడిపోయింది.. తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ఆ బాలుడు కన్నుమూశారు.. ఈ ప్రమాదంలో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది..…
తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఒక్క ఐడియా.. ఇప్పుడు కోట్లు కుమ్మరిస్తోంది.. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన డిస్కౌంట్ ఆఫర్కు అనూహ్యంగా స్పందన వస్తోంది.. చలాన్లు కట్టేందుకు వాహనదారులు పోటీ పడడంతో.. కొన్నిసార్లు సర్వర్ మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయంటే.. వాహనదారులు ఏ స్థాయిలో పెండింగ్ చలాన్లు క్లియర్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ఇక, దీనికి సంబంధించిన తాజా డేటాను విడుదల చేశారు ట్రాఫిక్ పోలీసులు.. ఈ నెల 1వ…
హోలీ వేడుకలతో జంటనగరాల పరిధిలో పోలీసులు 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని…
ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు బీజేపీ తల పెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ఎక్కటేలకు అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు.. తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ సభ్యుల సస్పెన్షన్ను నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకోగా… పోలీసులు అనుమతి నిరాకరించారు.. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేపీ నేతలు.. ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. ఇందిరా పార్క్ వద్ద సీఎం ధర్నా…
మనదేశం వివిధ పండుగలు, వేడుకలు, సంప్రదాయాలు, ఆటలకు వేదిక. హోళీ పండగ అందరికీ రంగుల పండగ. కులమతాలకు అతీతంగా అందరూ కలసి రంగులు జల్లుకుని ఆనందంగా జరుపుకునే పండగ. కానీ అక్కడ హోళీ అంటే పిడిగుద్దులకు ప్రత్యేకం. జనం రెండు వర్గాలుగా విడిపోయి కొద్దిసేపు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ఆతరువాత అందరూ ఆనందంగా అలయ్ బలయ్ చేసుకుంటారు. రంగులు జల్లుకొమ్మంటే పిడిగుద్దులు ఎందుకు అని అంటే అది తరతరాలుగా వస్తున్న మా సాంప్రదాయం అని చెబుతున్నారు వారు. కొన్నేళ్లుగా…
పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటుండగా జరిగిన ఓ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతిచెందింది.. పిల్లల ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.. వెంటనే బాలికను ఉస్మానియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసిన అప్పటికే మృతిచెందినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం బాలిక శాండ్వి మృతిదేహం ఉస్మానియా ఆస్పత్రిలో…