తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది.. ఆ కుట్రను భగ్నం చేశారు సైబరాబాద్ పోలీసులు.. కొందరు దుండగులు మంత్రిని హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు.. పేట్ బషీరాబాద్లో నిందితులను అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్లో సుపారీ కిల్లర్స్ను అదుపులోకి తీసుకోవడంతో ఈ కుట్ర భగ్నం చేశారు.. మొత్తం ఏడుగురుని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు… ఇక, మంత్రి హత్యకు రూ.12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ సుపారీ కిల్లర్లను కలిసింది…
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పుల వ్యవహారం సంచలనగా మారింది.. ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.. అయితే, ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన భూ సెటిల్మెంట్లే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు.. సెటిల్మెంట్లతో పాటు శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కూడా దృష్టి సారించారు పోలీసులు.. హైదరాబాద్తో పాటు…
సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. యువతీయువకులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి మోసపోయి కేటుగాళ్ళ చేతిలో అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిపై అత్యాచారం చేశారు. మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో డయల్ 100 కు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే పరిధిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్…
అవసరం కోసం అప్పులు చేయడం సహజం. కానీ ఆ అప్పులే ముప్పుగా పరిణమిస్తే విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫైనాన్సర్ల వేధింపులు తట్టుకోలేక సాయి కృష్ణ(26) అనే యువకుడు మృతి చెందాడు. కరోనా కాలంలో చెల్లించవలసిన ఫైన్…
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి.. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఓ రియాల్టర్ గాయాలపాలయ్యాడరు.. తనపై ఎవరో తుపాకీతో కాల్పులు జరిపారని స్థానికులకు తెలిపాడు రియాల్టర్.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.. ఘటనా స్థలంలో ఉన్న స్కార్పియోకు రక్తం మరకలు గుర్తించారు.. అయితే, దీనిపై భిన్నకథనాలున్నాయి.. కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో కారు అదుపుతప్పినట్టుగా కూడా చెబతున్నారు.. ఒకరికి తీవ్రగాయాలు…
హైదరాబాద్ శివారులో పేలుడు కలకలం సృష్టించింది.. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్లో చెత్త కుండీలో పేలుడు సంభవించింది… ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్ నగర్లో చెత్త సేకరించేందుకు రంగముని సుశీలమ్మ, ఆమె భర్త ఆనందనగర్ పారిశ్రామిక వాడలకు ఉదయం ఆటోలో వెళ్లారు.. అయితే, చెత్త సేకరిస్తున్నండగా పేలుడు జరిగింది.. ఈ ఘటనలో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..…
హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి… పహాడీషరీఫ్లో లారీ డ్రైవర్పై కాల్పులు జరిపిన దుండగులు.. దారి దోపిడీకి పాల్పడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. టైర్ల లోడ్తో వెళ్తున్న లారీని ఆపిన దుండగులు.. లారీ డ్రైవర్పై కాల్పులు జరిపారు.. డ్రైవర్ను భయపెట్టి 44 లక్షల రూపాయల విలువైన టైర్లను అపహరించారు.. డ్రైవర్ పై కాల్పులు జరిపి లారీని అపహరించరు దుండగులు.. ఆ తర్వాత టైర్లు అన్నింటినీ గోదాంలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డ్రైవర్ని వదిలిపెట్టింది…
కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది.. మొన్నటివరకూ హిజాబ్ వ్యవహారం హీట్ పుట్టించగా…. ఇప్పుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కలకలం రేపుతోంది.. దీంతో శివమొగ్గ ఉద్రిక్తంగా మారింది. ఈ హత్య రాజకీయంగాను పెను సంచలనం సృష్టించింది. హత్యవెనక శివకుమార్ ఉన్నారని మంత్రి ఈశ్వరప్ప ఆరోపించగా.. దీని వెనక ఉన్నవారిని ఉరితీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా హత్య జరిగిన శివమొగ్గ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి చేజారకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే…
బెంగళూరులోని నందిహిల్స్ ప్రాంతం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. నంది హీల్స్ ట్రెక్కింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. నంది హిల్స్ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ట్రెక్కింగ్ చేస్తుంటారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. ఇదేవిధంగా ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల నిశాంక్ శర్మ అనే యువకుడు నంది హిల్స్కు ట్రెక్కంగ్ కోసం వచ్చాడు. అయితే, అనుకోని విధంగా కొండపైనుంచి దొర్లి 300 అడుగుల కిందకు పడిపోయాడు. భూమిపై ఇంకా నూకలు…