IPL: రేపే ఐపీఎల్ సీజన్ స్టార్ట్.. ఉగ్రముప్పుపై స్పందించిన పోలీసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఐపీఎల్-15 వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై-కోల్కతా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఉగ్రవాదులు ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లను టార్గెట్ చేసినట్లు సమాచారం. క్విక్ రెస్పాన్స్ బాంబ్ స్వ్కాడ్ టీం ఇచ్చిన హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు మారువేశంలో మ్యాచ్లు జరగనున్న స్టేడియాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. మరోవైపు, ఐపీఎల్ 2022కి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు లేవని ముంబై పోలీసులు తెలిపారు.. మార్చి 26 నుంచి నగరంలో జరగనున్న IPL-2022 క్రికెట్ మ్యాచ్లకు ఉగ్రవాద బెదిరింపులు ఉన్నట్లు.. ఎలాంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు లేదా సమాచారం అందలేదని ముంబై పోలీసులు గురువారం వెల్లడించారు.
Read Also: KTR US Tour: హైదరాబాద్తో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన బోస్టన్ సిటీ..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
- Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
- Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
- Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
IPL మ్యాచ్లు జరిగే ప్రదేశాలు లేదా ఆటగాళ్లు బస చేసే హోటళ్లలో టెర్రర్ గ్రూపులు రెక్సీ నిర్వహించి, టోర్నమెంట్కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని కొన్ని మీడియా విభాగాలలో వచ్చిన వార్తలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ లట్కర్ ఖండించారు. హోటల్ ట్రైడెంట్, వాంఖడే స్టేడియం మరియు రెండు ప్రదేశాల మధ్య (సుమారు 1.5 కి.మీ) మార్గంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.. హోటలు, స్టేడియం మరియు మార్గాన్ని ముట్టడించే ప్రణాళికలతో టెర్రర్ గ్రూపులు రెక్సీ నిర్వహించాయని కొన్ని మీడియా నివేదికలు ముందు రోజు పేర్కొన్నాయి.. అయితే ముంబై పోలీసులు అధికారికంగా స్థితిని స్పష్టం చేశారు మరియు అలాంటి అవకాశాన్ని తోసిపుచ్చారు. ఇక, తొలి మ్యాచ్ చెన్నై-కోల్కతా మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న విషయం తెలిసిందే.. సారథ్య బాధ్యతలను జడేజాకు అప్పగిస్తున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ప్లేయర్, వికెట్ కీపర్గా ధోనీ… కొనసాగుతాడని చైన్నై యాజమాన్యం ప్రకటించింది. ధోని కెఫ్టెన్సీలో సీఎస్కే నాలుగుసార్లు టైటిల్ గెలుచుకుంది. 2008 నుంచి చెన్నైకు కెఫ్టెన్ వ్యవహారిస్తున్నాడు. మరీ జడేజా సారథ్యంలో సీఎస్కే ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!