IPL: రేపే ఐపీఎల్ సీజన్ స్టార్ట్.. ఉగ్రముప్పుపై స్పందించిన పోలీసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఐపీఎల్-15 వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై-కోల్కతా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఉగ్రవాదులు ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లను టార్గెట్ చేసినట్లు సమాచారం. క్విక్ రెస్పాన్స్ బాంబ్ స్వ్కాడ్ టీం ఇచ్చిన హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొందరు ఉగ్రవాదులు మారువేశంలో మ్యాచ్లు జరగనున్న స్టేడియాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో స్టేడియాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. మరోవైపు, ఐపీఎల్ 2022కి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు లేవని ముంబై పోలీసులు తెలిపారు.. మార్చి 26 నుంచి నగరంలో జరగనున్న IPL-2022 క్రికెట్ మ్యాచ్లకు ఉగ్రవాద బెదిరింపులు ఉన్నట్లు.. ఎలాంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు లేదా సమాచారం అందలేదని ముంబై పోలీసులు గురువారం వెల్లడించారు.
Read Also: KTR US Tour: హైదరాబాద్తో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన బోస్టన్ సిటీ..
Also Read
- 2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
- Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
- IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
- Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
IPL మ్యాచ్లు జరిగే ప్రదేశాలు లేదా ఆటగాళ్లు బస చేసే హోటళ్లలో టెర్రర్ గ్రూపులు రెక్సీ నిర్వహించి, టోర్నమెంట్కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని కొన్ని మీడియా విభాగాలలో వచ్చిన వార్తలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ లట్కర్ ఖండించారు. హోటల్ ట్రైడెంట్, వాంఖడే స్టేడియం మరియు రెండు ప్రదేశాల మధ్య (సుమారు 1.5 కి.మీ) మార్గంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.. హోటలు, స్టేడియం మరియు మార్గాన్ని ముట్టడించే ప్రణాళికలతో టెర్రర్ గ్రూపులు రెక్సీ నిర్వహించాయని కొన్ని మీడియా నివేదికలు ముందు రోజు పేర్కొన్నాయి.. అయితే ముంబై పోలీసులు అధికారికంగా స్థితిని స్పష్టం చేశారు మరియు అలాంటి అవకాశాన్ని తోసిపుచ్చారు. ఇక, తొలి మ్యాచ్ చెన్నై-కోల్కతా మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న విషయం తెలిసిందే.. సారథ్య బాధ్యతలను జడేజాకు అప్పగిస్తున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ప్లేయర్, వికెట్ కీపర్గా ధోనీ… కొనసాగుతాడని చైన్నై యాజమాన్యం ప్రకటించింది. ధోని కెఫ్టెన్సీలో సీఎస్కే నాలుగుసార్లు టైటిల్ గెలుచుకుంది. 2008 నుంచి చెన్నైకు కెఫ్టెన్ వ్యవహారిస్తున్నాడు. మరీ జడేజా సారథ్యంలో సీఎస్కే ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!