11 మంది కార్మికులు సజీవదహనం అయిన బోయిగూడ అగ్నిప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ప్రమాద ఘటనను త్రీడీ స్కనర్తో పరిశీలించాయి క్లూస్ టీమ్స్.. 11 మంది కార్మికులు సజీవ దహనం అయిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాయి.. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించారు ఫైర్ సేఫ్టీ అధికారులు మరియు క్లూస్ టీమ్స్.. షార్ట్ సర్క్యూట్తో ఎగిసిపడిన నిప్పు రవ్వల కారణంగా.. అగ్ని ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.. దీంతో స్క్రాప్ గోదాంలో మంటల అంటుకోవడం ద్వారా కరెంట్ బోర్డులు, సిలిండర్ పేలుడు సంభవించాయని చెబతున్ఆరు.. ఇక, ఈ ప్రమాదంలో ఫ్యూజ్లే కొంపముంచ్చాయా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.. ఒక్కో ఫ్యూజ్లో అదనంగా మందమైన మూడు నాలుగు వైర్లు ఉన్నట్లు గుర్తించారు.. కేబుల్ వయర్లు మరియు ప్లాస్టిక్ వయర్లపై నిప్పురవ్వలు పడడం, స్విచ్ బోర్డులు, గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదానికి దారితీసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Read Also: Psycho Husband: వీడు మామూలోడు కాదు.. వికృత వేధింపులు..
స్క్రాప్ గోదాంలో 10కిపైగా స్విచ్బోర్డులు ఉన్నట్టు గుర్తించారు.. గోదాంలో కరెంట్ ఎక్కువ వాడకంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాంలోని గ్రౌండ్ ఫ్లోర్లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డట్టుగా చెబున్నారు.. ఇక, ఇనుప మెట్లు ఉడడంతో పైనున్న వారు కిందకు రాలేకపోయారని, దట్టమైన పొగవల్ల సృహకోల్పోయి మంటల్లో సజీవదహనం అయినట్టు నిర్దారణకు వస్తున్నారు.. మరోవైపు.. అగ్నిప్రమాదం, గ్యాస్ పేలుడు ధాటికి తునాతునకలయ్యాయి రేకులు .. సిలిండర్ రెగ్యులేటర్ పక్కనే ఉన్న మరో షేడ్ పై పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. సిలిండర్ పిన్ సైతం సిలిండర్లోకి వెళ్లినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. క్లూస్ టీమ్ ఇన్చార్జ్ డాక్టర్ వెంకన్న నేతృత్వంలో 12 మంది సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.. త్రీడీ స్కానర్తో అణువణువూ పరిశీలన ద్వారా సేకరించిన ఆధారాలు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు తరలించారు.