పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెబితే అందరికీ గౌరంగా ఉంటుంది.. పిల్ల నచ్చిందని చెప్పి.. కట్నానికి ఓకే చెప్పి.. అందరినీ ఆహ్వాన పత్రికలు పంపించి.. తీరా పెళ్లికి అంతా సిద్ధమైన సమయంలో.. డ్రామా చేస్తే ఎవరికైనా మండిపోద్ది.. మరీ ముఖ్యంగా వధువు తరపు వారైతే ఈ విషయాన్ని జీర్ణించుకోవడం కష్టం.. ఎందుకంటే.. పెళ్లి ఒకసారి ఆగిందంటే.. ఏం జరిగిందో..? అనే తప్పుడు ప్రచారం చేసే వాళ్లు వారి పక్కనే కాసుకు కూర్చుంటారు కాబట్టి.. అయితే, జగిత్యాల జిల్లా…
మానవత్వం మంట కలిసింది.. తోటి స్నేహితురాలి పట్ల జాలి చూపాల్సిన ఓ యువతి.. రాక్షసంగా ప్రవర్తించింది. పాక్లో తన తండ్రిని పెళ్లి చేసుకోవాలంటూ మెడికల్ విద్యార్థినిపై ఒత్తిడి చేసింది తోటి స్నేహితురాలు. అందుకా యువతి నిరాకరించింది. తన కంటే వయస్సులో పెద్దవాడైన వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవాలని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె ఫ్రెండ్.. తండ్రితో కలిసి యువతిని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టింది. అంతేకాదు.. సారీ చెప్పాలని ఆమెతో బూట్లు, చెప్పులు నాకించారు. ఎంత…
దేవుడి దర్శనం కోసం వెళ్లిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో.. వారి కుటుంబంలో రోధనలు మిన్నంటాయి… కర్ణాటకలోని బీదర్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీదర్లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టింది కారు.. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జైంది… ఈ ప్రమాదంలో ఐదురుగు మృతిచెందగా.. మరో ఐదురుగు తీవ్రగాయాలపాలయ్యారు.. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా..…
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేశాడు.. చివరకు భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు.. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ప్రాణాలు వదిలాడు. కర్ణాటకలో జరిగిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్ని తాకాయి.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి.. ప్రతీ ఇంటిపై జెండా.. ప్రతీ గల్లీలో జెండా.. ప్రతీ ఊరిలో జెండా, ప్రతీ వీధిలో జెండా అనే తరహాలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న వేళ.. కర్ణాటకలోని దక్షిణ…
ఆడ, మగ మధ్యే కాదు.. ఇద్దరు మహిళల మధ్య కూడా ప్రేమలు ఉంటాయి.. కానీ, ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకునే ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి.. సమాజం ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకుంటూ అంగీకరించదు.. అయితే, కడప జిల్లాలో ఓ ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఓ యువకుడితో పెళ్లి జరిగిన తర్వాత.. వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. విడిపోయారు.. ఈ నేపథ్యంలో.. మరో యువతితో స్నేహం.. ఆ తర్వాత ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది…
కామన్వెల్త్ గేమ్స్ నుండి 10 మంది శ్రీలంక క్రడీకారులు అదృశ్యమయ్యారని అధికారులు ప్రకటించారు.. తొమ్మిది మంది శ్రీలంక అథ్లెట్లు మరియు మేనేజర్ తమ ఈవెంట్లను పూర్తి చేసిన తర్వాత అదృశ్యం కావడం కామన్తెల్త్ గేమ్స్లో కలకలం సృష్టిస్తోంది.. అయితే, సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక కామన్వెల్త్ క్రీడల బృందంలోని పది మంది సభ్యులు బ్రిటన్లో ఉండేందుకు అనుమానాస్పద ప్రయత్నంలో అదృశ్యమయ్యారని ద్వీప దేశానికి చెందిన ఒక ఉన్నత క్రీడా అధికారి అనుమానం వ్యక్తం చేశారు.. మొదట జూడోకా చమీలా…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది.. సిటీ నుంచి విదేశాల వరకు తన చీకటి వ్యాపారాన్ని విస్తరించిన చికోటి? ఎవరు అనే చర్చ సాగుతోంది..
భాగ్యనగరంలో అలజడి సృష్టించిన చైన్ స్నాచర్లు అరెస్ట్ చేసారు పోలీసులు. ఇద్దరు చైన్ స్నాచర్లు విశాంత్, రాహుల్ ను సైబరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. గుల్బర్గా నుండి జూలై 22న నగరానికి వచ్చిన చైన్ స్నాచర్స్ బైక్ పై వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. జూలై 22 న కొండాపూర్, మూసాపేట్ ఆర్సిపురం లో ముగ్గురు మహిళల చైన్ లు స్నాచింగ్ చేసినట్లు వెల్లడించారు. జులై 25న ఇద్దరు బైకుపై మియాపూర్ లోని మాతృశ్రీ కాలనీ మహిళ గొలుసు…
మధురైలో ఉసిలంపల్లిలోని ఈశ్వరి అమ్మవారి ఆలయ ఉత్సవాలలో ఘర్షణ చోటుచేసుకుంది. ఉత్సవాల సమయంలో ప్రత్యేక పూజల విషయంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఒకరినొకరు కర్రలతో, రాళ్లతో ఆలయంలోనే కొట్టుకున్నారు ఇరువర్గాల వారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇరువర్గాల ఘర్షణల్లో గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు. అయితే, ఉత్సావాల సమయంలో ప్రత్యేక పూజల విషయంలో రెండు వర్గాలలో విబేధాలే ఈ ఘర్షణకు కారణంగా తేల్చారు…