Vizag Sai Priya Case: విశాఖ సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్తతో వెళ్లి విశాఖపట్నం ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. భర్తను ఏమార్చి ప్రియుడితో కలిసి సాయిప్రియ వెళ్లిపోగా.. తన భార్య సముద్రంలో గల్లంతయ్యిందని భావించిన ఆమె భర్త ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో, పోలీసులు, నేవీ, సముద్రతీరంలో గస్తీ దళం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.. కానీ, పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.. ప్రియుడితో వెళ్లిపోయిన ఆమె.. అతడిని పెళ్లి చేసుకుంది.. ఇక, తన కోసం వెతకవద్దు అంటూ.. మమ్మల్ని వదిలేయండి అంటూ తన పేరెంట్స్కు మెసేజ్ పెట్టి ట్విస్ట్ ఇచ్చింది.. ఇక, అంతేకాదు.. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి విశాఖపట్నం పోలీస్స్టేషన్లో ప్రత్యక్షమైన ఆమె.. తమకు రక్షణ కల్పించాలంటూ మరో ట్విస్ట్.. ఇలా ఎన్నో మలుపు తిరుగుతూ వచ్చిన ఈ కేసులో.. తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. తాజాగా, సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై కేసు నమోదు చేశారు పోలీసులు..
Read Also: Astrology : ఆగస్టు 29, ఆదివారం దినఫలాలు
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
సాయిప్రియ, రవితేజపై ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్గార్డ్, పోలీసుల సమయం వృథా అయ్యిందంటున్నారు పోలీసులు. మరోవైపు, తనకు భర్త ఉండగానే అతడ్ని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు దిగాలనుకున్నారు త్రీటౌన్ పోలీసులు.. అయితే, దీనిపై కోర్టును ఆశ్రయించారు.. ఇక, కోర్టు కూడా అనుమతించడంతో సాయిప్రియ, రవితేజపై తాజాగా కేసు నమోదు చేశారు.. కాగా, విశాఖకు చెందిన సాయిప్రియకు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావుతో పెళ్ జరిగింది.. ఆమె భర్త హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా.. సాయిప్రియ వైజాగ్లోనే ఉంటూ ఏదో కోర్సు నేర్చుకుంటుంది.. అయితే, గత నెల 25వ తేదీన వారి పెళ్లిరోజు కావడంతో.. శ్రీనివాసరావు విశాఖ వెళ్లారు.. దంపతులు ఇద్దరూ సాయంత్రం ఆర్కే బీచ్కు వెళ్లారు.. కానీ, రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె అదృశ్యం కావడం.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు.. అందరూ రంగంలోకి దిగడం.. మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!