Vizag Sai Priya Case: విశాఖ సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్తతో వెళ్లి విశాఖపట్నం ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. భర్తను ఏమార్చి ప్రియుడితో కలిసి సాయిప్రియ వెళ్లిపోగా.. తన భార్య సముద్రంలో గల్లంతయ్యిందని భావించిన ఆమె భర్త ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో, పోలీసులు, నేవీ, సముద్రతీరంలో గస్తీ దళం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.. కానీ, పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.. ప్రియుడితో వెళ్లిపోయిన ఆమె.. అతడిని పెళ్లి చేసుకుంది.. ఇక, తన కోసం వెతకవద్దు అంటూ.. మమ్మల్ని వదిలేయండి అంటూ తన పేరెంట్స్కు మెసేజ్ పెట్టి ట్విస్ట్ ఇచ్చింది.. ఇక, అంతేకాదు.. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి విశాఖపట్నం పోలీస్స్టేషన్లో ప్రత్యక్షమైన ఆమె.. తమకు రక్షణ కల్పించాలంటూ మరో ట్విస్ట్.. ఇలా ఎన్నో మలుపు తిరుగుతూ వచ్చిన ఈ కేసులో.. తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. తాజాగా, సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై కేసు నమోదు చేశారు పోలీసులు..
Read Also: Astrology : ఆగస్టు 29, ఆదివారం దినఫలాలు
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
సాయిప్రియ, రవితేజపై ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్గార్డ్, పోలీసుల సమయం వృథా అయ్యిందంటున్నారు పోలీసులు. మరోవైపు, తనకు భర్త ఉండగానే అతడ్ని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు దిగాలనుకున్నారు త్రీటౌన్ పోలీసులు.. అయితే, దీనిపై కోర్టును ఆశ్రయించారు.. ఇక, కోర్టు కూడా అనుమతించడంతో సాయిప్రియ, రవితేజపై తాజాగా కేసు నమోదు చేశారు.. కాగా, విశాఖకు చెందిన సాయిప్రియకు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావుతో పెళ్ జరిగింది.. ఆమె భర్త హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా.. సాయిప్రియ వైజాగ్లోనే ఉంటూ ఏదో కోర్సు నేర్చుకుంటుంది.. అయితే, గత నెల 25వ తేదీన వారి పెళ్లిరోజు కావడంతో.. శ్రీనివాసరావు విశాఖ వెళ్లారు.. దంపతులు ఇద్దరూ సాయంత్రం ఆర్కే బీచ్కు వెళ్లారు.. కానీ, రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె అదృశ్యం కావడం.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు.. అందరూ రంగంలోకి దిగడం.. మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!