ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.. విశాఖలో రేపు జరగబోయే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని SPG ఆధీనంలోకి తీసుకుంది.. AU ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.. బయట నుండి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు పోలీసులు.. ఇక, నేడు, రేపు సభా పరిసర ప్రాంతాల్ల్ నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు..
తిరుపతి జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు పోలీసుల ఆంక్షలు, షరతులు విధించారు. నూతన సంవత్సర వేడుకల వేళ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబరు 31 రాత్రి తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రోడ్లు నందు చెక్ పోస్ట్లు, పికెట్లను ఏర్పాట్లు చేసి.. రాత్రి 10 గంటల నుండి వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించి, తెల్లవారుజామున వరకు కొనసాగుతుందని తెలిపారు.
విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో.. 31వ తేదీ రాత్రి నగరంలో ఫ్లై ఓవర్లు, పశ్చిమ బైపాస్ పై ట్రాఫిక్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నగర వాసులకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పలు సూచనలు చేశారు.
Allu Arjun: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటన ఘటనపై హీరో అల్లు అర్జున్ 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందుకు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు ఏసీపీ ముందు అల్లు అర్జున్ విచారణకు హాజరుకానున్నారు. అల్లు అర్జున్ను దర్యాప్తు అధికారి ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించనున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు…
New Year Celebrations: మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంది ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కడికెళ్లాలి, ఏం చేయాలి అనే కార్యక్రమాలను ఫిక్స్ చేసుకుంటున్నారు.
కొమురం భీం జిల్లా పోలీసులతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా పోలీసులను సైతం ఉన్నతాధికారులు రప్పించారు. విద్యార్ధిని ఇంటికి వెళ్లేందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఒక్క వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే, జిల్లాలో మీడియాపై సైతం పోలీసుల ఆంక్షలు విధించారు. విద్యార్ధిని శైలజ స్వగ్రామానికి వెళ్లకుండా 10 కిలో మీటర్ల దూరంలో మీడియాను ఆపేశారు పోలీసులు.
Bike Racing: హైదరాబాద్ లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. బైక్ రేసింగ్లు, స్టంట్ల పై పోలీసుల ఆంక్షలను రేసర్లు లెక్కచేయడం లేదు. క్రిమినల్ కేసులు పెడతామంటున్నా రేసర్లు పట్టించుకోవడం లేదు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు.
హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
Tirumala Brahmotsavam: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రైవేట్ వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. రేపు (అక్టోబర్ 4వ తేదీ) నుంచి ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రైవేట్ వాహనాలను పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు.