Ramagundam: ఎన్టీపీసీ ఫేజ్-2 ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం
- మొదలైన రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్-2 కోసం ప్రజాభిప్రాయ సేకరణ
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహణ.
- ప్రజలు హాజరుకాలేకపోవడంతో సభలో ఖాళీ కుర్చీలు దర్శనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramagundam: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నేడు రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్-2 కోసం ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రశాంతంగా కొనసాగించేందుకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, ముఖ్యంగా స్థలాల కోసం ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అయితే, స్థానిక భూ నిర్వాసితులు, ప్రజాప్రతినిధులు ప్లాంటు ఏర్పాటుతో పాటు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల పహారాలో సాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల హాజరుపై ఆంక్షలు విధించడం వివాదానికి దారితీసింది. స్థానిక నాయకులను, ప్రజలను లోనికి అనుమతించకుండా, ఎంపిక చేసిన వారినే ఈ సమావేశంలో పాల్గొనేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజల పట్ల కూడా ఇలాంటి ఆంక్షలు విధించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అరెస్టు చేసిన స్థానిక నాయకులను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Also Read: Bhumana Karunakar Reddy: చంద్రబాబు మాటలపై పవన్ సమాధానం చెప్పాలి.. ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారు..?
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఎన్టీపీసీ ప్రాజెక్టు పేజ్-2 పై ప్రజల అభిప్రాయాలను స్వీకరించడానికి నిర్వహించిన ఈ సమావేశంలో ఎక్కువ మంది ప్రజలు హాజరుకాలేకపోవడంతో సభలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. ప్రజాభిప్రాయ సేకరణను ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, స్థానికుల ఆందోళనలు, పోలీసుల ఆంక్షలు కార్యక్రమం చుట్టూ వివాదాలు సృష్టిస్తున్నాయి. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు భవిష్యత్తు మీద ఈ అభిప్రాయ సేకరణ ఎంత మేర ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!