పోలవరంపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుామరుకు మాజీ మంత్రి దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. దేవినేని ఉమ మాట్లాడుతూ… పోలవరం 2021 డిసెంబరుకు పూర్తి చేస్తామన్న మంత్రి అనిల్ ప్రకటన ఏమయ్యింది అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో, మీడియాలో జరిగే చర్చకు మంత్రి అనిల్ ఏమి సమాధానం ఇస్తారు అన్నారు. ప్రతిపక్షాలను తిట్టి పోలవరం నుంచి తప్పించుకోలేరు. పోలవరం కోసం కేంద్రం నుంచి వచ్చిన రూ. 4 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు అని…
ఆంధ్రుల పాలిట వరం పోలవరం విషయంలో కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఇచ్చిన నిధుల్లోనూ కేంద్రం కోత పెడుతుండడం అసహనం పెంచుతోంది. విద్యుత్కేంద్రం తవ్వకం పనులకు గతంలో ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం తెలిపిందని తెలుస్తోంది. పోలవరం దగ్గర 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం పనులు చురుకుగా సాగుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.4,560.91 కోట్లను డీపీఆర్ నుంచి ఇప్పటికే మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రం అడగడం లేదు. విద్యుత్కేంద్రానికి…
పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై లోకేష్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. 2016లో స్పెషల్ ప్యాకేజ్ లో భాగంగా పోలవరం అంచనాలు 20వేల కోట్లకు కుదిస్తే చంద్రబాబు సంతకాలు చేశారు. కానీ సీఎం జగన్ సూచనల మేరకు పోలవరం నిధల కోసం పార్లమెంటు సమావేశాలు స్తంభింపచేశాం. ఇటీవలే పోలవరం సవరించిన అంచనాలు 47వేల కోట్లకు కేంద్రం…
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసే పనిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆలస్యం జరిగినా.. పనుల్లో జాప్యం జరగకుండా చ్యలు తీసుకుంటున్నారు. అయితే, పోలవరం పునరావాస పనులపై జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించింది నేషనల్ ఎస్టీ కమిషన్.. పోలవరం ముంపు ప్రాంతాల్లో గిరిజనుల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు.. పోలవరం బాధితుల నుంచి…
వర్షాలు కురిసి గోదావరికి పెద్దమొత్తంలో నీరు చేరితే దిగువున ఉన్న కోనసీమ వరదతో అనేక ఇబ్బందులు పడుతుండేది. వేలాది ఎకరాల పంట వరదనీటికి కొట్టుకుపోయేది. ప్రస్తుతం దిగువ గోదావరిపై పోలవరం డ్యామ్ను నిర్మిస్తున్నారు. ఈ డ్యామ్ పూర్తికావడానికి కొంత సమయం పడుతుంది. అయితే, పోలవరం వద్ద ప్రస్తుతం కాఫర్ డ్యామ్ ను ఏర్పాటు చేయడంతో వరద ఉధృతి కొంతమేర తగ్గింది. గతంలో రాజమంత్రి తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తేది. కాని, ఇప్పుడు ఆ పరిస్థితులు…
కేంద్ర జలశక్తిశాఖ ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. రూ.47,725 కోట్ల రూపాయలకు పోలవరం ప్రాజెక్టు అంచనాలను సవరించారు. ఈ అంచనాలను అంగీకరిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. సవరించిన అంచనాలకు సంబందించిన ప్రతిపాదనలను రేపు ఆర్ధిక శాఖలకు పంపించనున్నారు. పోలవరం సవరించిన అంచనాలకు సంబందించిన ప్రతిపాదనలు పై వచ్చేవారం కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నది. పోలవరం ప్రాజెక్టును ఈ…
పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజన కమిషన్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలి, లేకపోతే సమాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా తరలించడంపై స్పందించిన జాతీయ గిరిజన కమిషన్.. ఈ మేరకు ఏపీ,…
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్ సైట్కు వెళ్లారు.. స్పిల్వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్వేపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో…