పోలవరం.. ఏపీ, కేంద్రానికి జాతీయ గిరిజన కమిషన్ నోటీసులు
పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజన కమిషన్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలి, లేకపోతే సమాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా తరలించడంపై స్పందించిన జాతీయ గిరిజన కమిషన్.. ఈ మేరకు ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు, కేంద్ర జలశక్తి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది.
కాగా, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని గిరిజనులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు “జాతీయ ఎస్టీ కమిషన్” కు ఫిర్యాదు చేవారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 (ఎ) ప్రకారం, ఈ ఫిర్యాదుపై విచారణ జరిపాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది.. పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా గిరిజనులను తరలించడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది… ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలలో వాస్తవాలు, తీసుకున్న చర్యలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను 15 రోజుల్లో ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర అధికారులకు ఆదేశించింది.. ఒక వేళ నిర్ణీత సమయంలో నివేదిక అందించకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 (ఎ)లో క్లాజ్ (8) ప్రకారం కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
తాజావార్తలు
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో