అంతర్జాతీయంగా భారతదేశ గౌరవాన్ని పెంచడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త భారతదేశం రూపుదిద్దుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు.
Social Media DP Change: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15 వరకు సోషల్ మీడియా ఉపయోగించే పౌరులంతా తమ ప్రొఫైల్ పిక్చర్ లేదా డిస్ప్లే పిక్చర్(డీపీ)గా త్రివర్ణ పతాకం ఉంచాలని ప్రధాని మోదీ ఇటీవల కోరారు. దీంతో చాలా మంది వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా పలు సోషల్ మీడియా అకౌంట్లలో ప్రొఫైల్ పిక్గా మువ్వన్నెల జెండాను…
జాతీయ జెండాకు ప్రాణం పోసింది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లానేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 'ఆజాదికా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేఎల్ యూనివర్సిటీలో 'మోదీ@2.0' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. 2014లో సమర్థవంతమైన నాయకుడు దేశానికి కావాలని మోదీని ఎన్నుకున్నారని కేంద్ర మంత్రి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రామగుండంలో ఉన్న జలాశయంలోని 600 ఎకరాలలో ఎన్టీపీసీ నిర్మించిన ఇటువంటి అతి పెద్ద ప్రాజెక్టు తెలంగాణలోనే ఉండటం అందరికీ చాలా గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
మగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 600 ఎకరాల్లో 423 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. దేశంలోనే అతి పెద్దదైన నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ను ప్రధాని రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండల కేంద్రంలో వర్చువల్గా ప్రారంభించారు.
PM Narendra Modi-All India District Legal Service Authorities meet: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఎంత ముఖ్యమో..ఈజ్ ఆఫ్ జస్టిస్ కూడా అంతే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీటింగ్ తొలి కార్యక్రమంలో అన్నారు. ఏ సమాజానికైనా న్యాయవ్యవస్థ అవసరం.. అదే విదంగా న్యాయం అందించడం కూడా ముఖ్యమే అని ఆయన అన్నారు.
O Panneerselvam Joining BJP: తమిళనాడు రాజకీయాలు కీలక చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల అన్నాడీఎంకే పార్టీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. పార్టీపై పట్టు సాధించే ప్రయత్నంలో ఇరు వర్గాలు పోటాపోటీగా కోర్టు కేసులు పెట్టుకున్నాయి.
తమిళనాడు వేదికగా 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్-2022 పోటీలు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సూపర్స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
NIA conducts raids at multiple locations in Bihar: బీహార్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ఇటీవల బీహార్ పోలీసులు పాట్నా ఉగ్ర కుట్రను ఛేదించారు. ఈ కేసుపై ఎన్ఐఏ కూడా విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఉగ్రకుట్రలో కీలకంగా ఉన్న కొంతమంది ఇళ్లపై దాడులు నిర్వహించారు. బీహార్ దర్భంగాలోని ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నూరుద్దీన్, సనావుల్లా, ముస్తకీమ్ ఇళ్లపై దాడులు చేసింది ఎన్ఐఏ. ఈ ముగ్గురు కూడా…
RS MPs Protest..Slogans against Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలని పట్టుబడుతున్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బనం, ఇతర ప్రజా సమస్యలపై తక్షణమే పార్లమెంట్ ఉభయసభల్లో ప్రత్యేక చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు