PM Narendra Modi: కోవిడ్ కట్టడిలో రాష్ట్రాలదే ఈ ఘనత.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi Comments in NITI Aayog Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. దేశంలోని 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2020 మార్చి కరోనా లాక్ డౌన్ తర్వత తొలిసారిగా ముఖాముఖీ సమావేశం జరిగింది. అంతకు ముందు కేవలం వర్చువల్ సమావేశాలే జరిగాయి. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడిలో దేశంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. కోవిడ్ కట్టడి ద్వారా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత దేశం ఓ నాయకుడిగా ఎదగడానికి దారి తీసిందని అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో తొలిసారి దేశంలోని ప్రధాన కార్యదర్శులంతా ఒకే చోట సమావేశం అయ్యారని.. మూడు రోజుల పాటు జాతీయ ప్రాధాన్యత అంశాలపై చర్చించారని వ్యాఖ్యానించారు.
నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యంగా వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని.. పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చర్చించారు. జాతీయ విద్యావిధానాన్ని ఉన్నత, పాఠశాల విద్యల్లో ప్రవేశపెట్టాలని సూచించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగయ్యాయని.. జీఎస్టీ వసూళ్లు పెరిగేలా కేంద్ర, రాష్ట్రాలు సమిష్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశం మారడానికి ఇది కీలకమని అన్నారు. కరోనా వ్యాప్తి సందర్భంలో భారత దేశ సమాఖ్య వ్యవస్థ ప్రపంచానికి ఓ నమూనాగా ఉందని అన్నారు.
Also Read
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
- Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
Read Also: Rashmika Mandanna: రెమ్యునరేషన్ అమాంతం పెంచిన రశ్మికా.. ఎంతంటే?
ప్రధాని మోదీ నీతి ఆయోగ్ సమావేశంలో 2023 భారత్ నిర్వహించే జీ-20 సమావేశంపై కూడా చర్చించారు. ఇది ఢిల్లీకే పరిమితం కాదని.. దేశంలో ప్రతీ రాష్ట్రాన్ని, కేంద్ర పాలిత ప్రాంతాన్ని ప్రపంచానికి చూపడానికి ప్రత్యేక అవకాశమని ఆయన అన్నారు. జీ 20 సమావేశాలు భారత్ కు ఓ గొప్ప అవకాశం అని.. ఏడాది పొడవునా ఢిల్లీలోనే కాకుండా.. ప్రతీ రాష్ట్రంలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమావేశాలు జరుగుతాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ . జైశంకర్ అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్లో.. ఇప్పుడు రికార్డులు..!
-
Imax in Hyderabad : ‘AMB ఐమాక్స్’.. మహేష్ బాబు, వెంకటేష్ లీగ్ కాంబోలో క్రేజీ మల్టీప్లెక్స్
-
lizards: ఇంట్లో బల్లుల బెడదా? పైసా ఖర్చు లేకుండా శాశ్వతంగా తరిమికొట్టేందుకు అద్భుతమైన చిట్కాలు ఇవే!
-
Virat Kohli Video: విన్నింగ్ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ వింత సెలబ్రేషన్.. ఆ సైగకు అర్థం ఏమిటి..? వీడియో వైరల్..
-
Virat Kohli Next Match: RCBకి ఐపీఎల్ 2026 టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ.. మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడు..?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!