PM Narendra Modi-All India District Legal Service Authorities meet: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఎంత ముఖ్యమో..ఈజ్ ఆఫ్ జస్టిస్ కూడా అంతే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీటింగ్ తొలి కార్యక్రమంలో అన్నారు. ఏ సమాజానికైనా న్యాయవ్యవస్థ అవసరం.. అదే విదంగా న్యాయం అందించడం కూడా ముఖ్యమే అని ఆయన అన్నారు.
O Panneerselvam Joining BJP: తమిళనాడు రాజకీయాలు కీలక చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల అన్నాడీఎంకే పార్టీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. పార్టీపై పట్టు సాధించే ప్రయత్నంలో ఇరు వర్గాలు పోటాపోటీగా కోర్టు కేసులు పెట్టుకున్నాయి.
తమిళనాడు వేదికగా 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్-2022 పోటీలు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సూపర్స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
NIA conducts raids at multiple locations in Bihar: బీహార్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ఇటీవల బీహార్ పోలీసులు పాట్నా ఉగ్ర కుట్రను ఛేదించారు. ఈ కేసుపై ఎన్ఐఏ కూడా విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఉగ్రకుట్రలో కీలకంగా ఉన్న కొంతమంది ఇళ్లపై దాడులు నిర్వహించారు. బీహార్ దర్భంగాలోని ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నూరుద్దీన్, సనావుల్లా, ముస్తకీమ్ ఇళ్లపై దాడులు చేసింది ఎన్ఐఏ. ఈ ముగ్గురు కూడా…
RS MPs Protest..Slogans against Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలని పట్టుబడుతున్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బనం, ఇతర ప్రజా సమస్యలపై తక్షణమే పార్లమెంట్ ఉభయసభల్లో ప్రత్యేక చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.
భారత 14వ రాష్ట్రపతిగా సేవలు అందించిన రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో శనివారం ఘనంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ఇతర కేంద్రమంత్రులు, రాజ్యసభ,లోక్ సభ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ నుంచి దిగిపోతున్న క్రమంలో ఆయన దేశాన్ని ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు.