Mamata Banerjee: ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Mamata Banerjee Meets PM Narendra Modi in Delhi: ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని వివర్శించే బెంగాల్ సీఎం, త్రుణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో ఆయన్ను కలిశారు మమతాబెనర్జీ. బెంగాల్ రాష్ట్రంలో సమస్యలను, జీఎస్టీ బకాయిల విడుదలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు మమతా బెనర్జీ. నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ వచ్చిన దీదీ, శుక్రవారం రోజు ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశం తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
దీంతో పాటు ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి మమతా హాజరవనున్నట్లు తెలిసింది. గతేడాది జరిగిన మీటింగ్ లో మమతా బెనర్జీ పాల్గొనలేదు. గురువారం రోజూ త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం అయిన మమతా బెనర్జీ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. ఈ మేరకు ప్రజా సమస్యలు, బెంగాల్ సమస్యలపై పోరాడాలని ఎంపీలకు దిశానిర్థేశం చేశారు. దీంతో పాటు అత్యంత కీలమైన 2024 పార్లమెంట్ ఎన్నికలపై కూడా మమతా బెనర్జీ టీఎంసీ ఎంపీలతోె చర్చించారు.
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
Read Also: Komatireddy Rajgopal Reddy : అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నా..
ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందు ప్రధాని మోదీని, మమతా బెనర్జీ కలవడం చర్చనీయాంశం అయింది. బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ కర్ ను ఎన్డీయే తన ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. మార్గరేట్ ఆల్వాను ప్రతిపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నియమించాయి. గవర్నర్ గా ఉన్న సమయంలో జగదీప్ ధన్ కర్, సీఎం మమతా బెనర్జీ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అయితే గతంలో స్వయంగా టీఎంసీ ప్రతిపాదించిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ప్రకటించింది. అయితే ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము చేతిలో ఘోర పరాజయం చూసిన సంగతి తెలిసిందే. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీఎంసీ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!