Mamata Banerjee: ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Mamata Banerjee Meets PM Narendra Modi in Delhi: ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని వివర్శించే బెంగాల్ సీఎం, త్రుణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో ఆయన్ను కలిశారు మమతాబెనర్జీ. బెంగాల్ రాష్ట్రంలో సమస్యలను, జీఎస్టీ బకాయిల విడుదలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు మమతా బెనర్జీ. నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ వచ్చిన దీదీ, శుక్రవారం రోజు ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశం తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
దీంతో పాటు ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి మమతా హాజరవనున్నట్లు తెలిసింది. గతేడాది జరిగిన మీటింగ్ లో మమతా బెనర్జీ పాల్గొనలేదు. గురువారం రోజూ త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం అయిన మమతా బెనర్జీ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. ఈ మేరకు ప్రజా సమస్యలు, బెంగాల్ సమస్యలపై పోరాడాలని ఎంపీలకు దిశానిర్థేశం చేశారు. దీంతో పాటు అత్యంత కీలమైన 2024 పార్లమెంట్ ఎన్నికలపై కూడా మమతా బెనర్జీ టీఎంసీ ఎంపీలతోె చర్చించారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Komatireddy Rajgopal Reddy : అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నా..
ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందు ప్రధాని మోదీని, మమతా బెనర్జీ కలవడం చర్చనీయాంశం అయింది. బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ కర్ ను ఎన్డీయే తన ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. మార్గరేట్ ఆల్వాను ప్రతిపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నియమించాయి. గవర్నర్ గా ఉన్న సమయంలో జగదీప్ ధన్ కర్, సీఎం మమతా బెనర్జీ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అయితే గతంలో స్వయంగా టీఎంసీ ప్రతిపాదించిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ప్రకటించింది. అయితే ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము చేతిలో ఘోర పరాజయం చూసిన సంగతి తెలిసిందే. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీఎంసీ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..