Social Media DP Change: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15 వరకు సోషల్ మీడియా ఉపయోగించే పౌరులంతా తమ ప్రొఫైల్ పిక్చర్ లేదా డిస్ప్లే పిక్చర్(డీపీ)గా త్రివర్ణ పతాకం ఉంచాలని ప్రధాని మోదీ ఇటీవల కోరారు. దీంతో చాలా మంది వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా పలు సోషల్ మీడియా అకౌంట్లలో ప్రొఫైల్ పిక్గా మువ్వన్నెల జెండాను పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టిన మొత్తం 75 రైల్వే స్టేషన్లను పిల్లలతో సహా ప్రజలందరూ సందర్శించాలని, ఆయా స్టేషన్లలో మహానేతలకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుంటూ వారి త్యాగాలను మననం చేసుకోవాలని ప్రధాని మోదీ కోరారు.
Read Also: Common Wealth Games 2022: కొనసాగుతున్న భారత క్రీడాకారుల హవా.. 9కి చేరిన పతకాల సంఖ్య