Kishan Reddy: ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలి
Kishan Reddy: జాతీయ జెండాకు ప్రాణం పోసింది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లానేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘ఆజాదికా అమృత్ మహోత్సవ్’లో భాగంగా కేఎల్ యూనివర్సిటీలో ‘మోదీ@2.0’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. 2014లో సమర్థవంతమైన నాయకుడు దేశానికి కావాలని మోదీని ఎన్నుకున్నారని కేంద్ర మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో 12 కోట్ల కుంభకోణాలు జరిగాయన్న ఆయన.. మోదీ నాయకత్వంలో ఒక్క అవినీతి మరక లేదన్నారు. మోదీ మాకు పని విషయంలో నరకం చూపిస్తారని తెలిపారు. గతంలో రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ ఉండేవారని అందరికి తెలుసన్నారు. 8 సంవత్సరాలుగా మోదీ ఒక్క సెలవు లేకుండా పని చేస్తున్నారని వెల్లడించారు. ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ అని.. 20 రోజులు ఫామ్ హౌస్.. 10 రోజులు ఇంట్లో ఉంటారని ఎద్దేవా చేశారు. మోదీ పుట్టినరోజు సైనికులతో చేసుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు.
జీ-20 సమావేశాల్లో గత ప్రభుత్వ ప్రధాని ఎక్కడో కని కనిపించని స్థానంలో కూర్చునేవారని.. కానీ మోదీ స్థానం ఎక్కడో అందరికీ తెలుసన్నారు. భారతీయులు అనేక దేశాల్లో తలెత్తుకుని తిరుగుతున్నారని గర్వంగా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలోనే జరుగుతుందన్నారు. అమెరికా కూడా మన కరోనా వ్యాక్సిన్ కావాలంటోందని పేర్కొన్నారు. ఇప్పటికే 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించామన్నారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడి తెలుగు విద్యార్థులను భారత్కు తీసుకొచ్చామన్నారు.
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
Bandi Sanjay: ఇక్కడ ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడు?
రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్ చేసి దేశ సత్తాను చాటామన్నారు. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి, అంబేడ్కర్ రాజ్యం తీసుకొచ్చామన్నారు. తమ పార్టీ పుట్టిందే జమ్ముకశ్మీర్ కోసమన్నారు. బీజేపీని ముస్లిం వ్యతిరేక పార్టీ అంటారు.. కానీ యూపీలో 80 శాతం మంది ముస్లింలు వున్న ప్రాంతంలో కూడా గెలిచామన్నారు. ఆగస్ట్ 15న ప్రజలంతా ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?