PM Modi: ఉక్రెయిన్ యుద్ధం, సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీతో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా తిరుగుబాటు గురించి ఇరువురు నేతలు సంభాషించారు. ఏ రకంగా తిరుబాటును పరిష్కరించారే వివరాలను పుతిన్, మోడీకి వివరించినట్లు క్రెమ్లిన్ తెలిపింది.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చేరుకునేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు. భారీ భద్రత మధ్య మెట్రో రైలులో ప్రధాని మోడీ ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేసే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
Uniform Civil Code: ప్రధాని నరేంద్రమోడీ యూనిఫా సివిల్ కోడ్(యూసీసీ)పై కీలక వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ముస్లిం సంస్థలు, పలు రాజకీయ పార్టీలు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సిక్కులకు సంబంధించి అత్యున్నత సంస్థగా ఉన్న శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) యూనిఫాం సివిల్ కోడ్ ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది
PM Modi: జూలై 14 ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ గౌరవ అతిథిగా హాజరుకాబోతున్నారు. పారిస్లోని చాంప్స్ ఎలిసీస్లో జరిగే బాస్టిల్ డే ఫ్లైపాస్ట్లో భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ యుద్ధవిమానాలు పాల్గొనున్నాయి.
Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, యూసీసీ)పై ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తు్న్నాయి. అసదుద్దీన్ ఓవైసీ వంటి నేతలు భారత వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని దొంగిలించాలని చూస్తున్నారని.. ప్రధానికి దమ్ముంటే ముందుగా యూసీసీని పంజాబ్ లో ప్రజలకు చెప్పండి అంటూ సవాల్ విసిరారు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రధాని, రాష్ట్రపతితో సమావేశం అయిన విషయాన్ని రాష్ట్రపతి భవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల అమెరికా, ఈజిప్టు పర్యటన వెళ్లి వచ్చిన తర్వాత ప్రధాని, రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయాలు తెలియలేదు.
Asadudiin Owaisi: భారతదేశంలో వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఓ సమస్యగా భావిస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. భోపాల్ లో ఓ సభలో ప్రధాని నరేంద్రమోడీ యూనిఫా సివిల్ కోడ్ (యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nitin Gadkari: ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ కలిగిన దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.