PM Modi: ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా మారనున్న భారత్.. 70వేల మందికి జాబ్ లెటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్ మారనుందని ప్రధని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా ‘రోజ్గార్ మేళా’ సందర్బంగా 70,000 మంది యువతకు ప్రధాని జాబ్ లెటర్లను వర్చువల్గా అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి 70,000 మందికి పైగా అపాయింట్మెంట్ లెటర్లను ఈరోజు పంపిణీ చేశారు. కొత్తగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న వేళ, ప్రభుత్వోద్యోగిగా పనిచేసే అవకాశం రావడం గొప్ప గౌరవమని, భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ దేశ ప్రజలు తీర్మానం చేశారని అన్నారు. వచ్చే 25 ఏళ్లు భారత్కు చాలా ముఖ్యమైనవని ప్రధాని అన్నారు.
Read also: Pawan Kalyan : బైజూస్ ట్యాబుల వ్యవహరంపై పవన్ ట్వీట్
Also Read
- Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ".. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- CarryMen: 'మీరు షాపింగ్ చేయండి, మీ బ్యాగులు మేము మోస్తాం'.. మార్కెట్లలో షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్..
మరి కొన్ని సంవత్సరాలలో, భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలోకి వస్తుందని ప్రతి నిపుణుడు చెబుతున్నాడు. దీని అర్థం ఉపాధి అవకాశాలు మరియు పౌరుల తలసరి ఆదాయం పెరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. గత ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రధాని మోదీ వారి హయాంలో బ్యాంకింగ్ రంగం భారీ విధ్వంసానికి గురైందన్నారు. ‘బ్యాంకింగ్ రంగం అత్యంత పటిష్టంగా భావించే దేశాల్లో నేడు భారత్ ఒకటి. కానీ 9 ఏళ్ల కిందటి పరిస్థితి ఇది కాదు.. గత ప్రభుత్వ హయాంలో మన బ్యాంకింగ్ రంగం భారీ విధ్వంసాన్ని చవిచూసింది. నేడు డిజిటల్ లావాదేవీలు చేయగలుగుతున్నాం. కానీ 9 ఏళ్ల క్రితం 140 కోట్ల మందికి ఫోన్ బ్యాంకింగ్ ఉండేది కాదని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో రోజ్గర్ మేళా జరిగింది. ఈ చొరవకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు UTలలో రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్త రిక్రూట్మెంట్లు, రెవెన్యూ శాఖ, ఆర్థిక సేవల విభాగం, పోస్ట్ల శాఖ, పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జలవనరుల శాఖ, ట్రాన్స్ పోర్ట్, హోం మంత్రిత్వ శాఖతో సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో యువత ప్రభుత్వ ఉద్యోగంలో చేరనున్నారు.
తాజావార్తలు
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!