PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM SVANidhi Scheme: చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి స్వనిధి (PM SVANidhi) పథకం విజయవంతంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2020 జూన్ 1న ప్రారంభమైన ఈ పథకం ద్వారా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో తీవ్రంగా నష్టపోయిన చిన్న వ్యాపారులకు ఈ పథకం పెద్ద ఊరటనిచ్చింది. పీఎం స్వనిధి పథకం ఆరేళ్ల పూర్తి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు అందడంతో పాటు, ఆర్థిక వ్యవస్థలో వారికి కొత్త అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ఈ పథకం నమ్మకం, సాధికారత అనే రెండు ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉందని మోడీ తెలిపారు.
చిన్న వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటూ మూలధనం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఈ పథకం ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. ప్రభుత్వం ఇటీవల ఈ పథకాన్ని 2030 వరకు పొడిగించడమే కాకుండా, రుణ పరిమితిని రూ.80 వేల నుంచి రూ.90 వేలకు పెంచింది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఎలాంటి తాకట్టు లేదా హామీ లేకుండానే రుణం అందించడం. రుణాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా పంపిణీ చేస్తారు. మొదటి విడతలో రూ.15,000, రెండో విడతలో రూ.25,000, మూడో విడతలో రూ.50,000 వరకు రుణం అందుతుంది. అయితే ప్రతి విడత రుణాన్ని నిర్ణీత గడువులో చెల్లించిన తర్వాతే తదుపరి విడత మంజూరు అవుతుంది.
Also Read
- Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
- Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
మొదటి విడతగా తీసుకున్న రూ.15 వేల రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండో విడతగా రూ.25 వేల రుణం లభిస్తుంది. ఆ మొత్తాన్ని కూడా సమయానికి చెల్లిస్తే మూడో విడతలో రూ.50 వేల రుణం మంజూరు అవుతుంది. ఈ విధంగా మొత్తం రూ.90 వేల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణం పొందే అవకాశం ఉంటుంది. పీఎం స్వనిధి పథకం కింద రుణం పొందడానికి పెద్దగా పత్రాలు అవసరం ఉండవు. ప్రధానంగా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే రుణాన్ని చిన్న చిన్న ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించే సౌలభ్యం కూడా కల్పించారు.
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సమీపంలోని ప్రభుత్వ బ్యాంకును సంప్రదించవచ్చు. దరఖాస్తు ఫారమ్ నింపి, ఆధార్ కార్డు కాపీతో పాటు అవసరమైన వివరాలను సమర్పిస్తే బ్యాంకు పరిశీలన అనంతరం రుణాన్ని మంజూరు చేస్తుంది. చిన్న వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందే లక్షలాది మంది వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం ఒక ఆర్థిక బలంగా మారిందని, భవిష్యత్తులో మరింత మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!