Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story World Leaders At Bharat Mandapam For G20 Special Dinner

G20 Dinner: జీ20 ప్రత్యేక విందు కోసం భారత్ మండపంలో ప్రపంచ నాయకులు

Published Date :September 9, 2023 , 10:09 pm
By Mahesh Jakki
G20 Dinner: జీ20 ప్రత్యేక విందు కోసం భారత్ మండపంలో ప్రపంచ నాయకులు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

G20 Dinner: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన జీ20 ప్రత్యేక విందు కోసం ప్రపంచ నాయకులు భారత్ మండపానికి చేరుకున్నారు. వారికి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక విందులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, చైనా ప్రధాని లీ కియాంగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వేదిక వద్దకు చేరుకున్నారు. ఇండోనేషియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, ఇతర దేశాల నాయకులు కూడా ప్రత్యేక విందుకు వచ్చారు.

Also Read: G20 Summit: స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందం కోసం పని చేసేందుకు మోడీ, రిషి సునాక్ అంగీకారం!

Also Read

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
Add as a preferred
source on google

యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్‌తో పాటు అతని భార్య అమేలీ డెర్బౌడ్రెంఘియన్ మిచెల్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, యూఎన్‌ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా కూడా ప్రెసిడెంట్ ముర్ము ఇచ్చిన జీ20 విందు కోసం భారత్ మండపానికి చేరుకున్నారు. అంతేకాకుండా నేతల రాకకు ముందే ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము వేదిక వద్దకు చేరుకుని వారికి అభివాదం చేశారు. దేశ రాజధానిలో అధ్యక్షుడు ద్రౌపది ముర్ము నిర్వహించిన జీ20 విందుకు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో మొత్తం 170 మంది అతిథులు ఉన్నారు. శనివారం భారత మండపంలోని మల్టీ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ విందుకు విదేశీ నేతలు, ప్రతినిధి బృందాల అధిపతులతోపాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్, రాష్ట్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర విశిష్ట అతిథులను ఆహ్వానించారు.

Also Read: G20 Summit: ఉక్రెయిన్‌ యుద్ధంపై తీర్మానం.. జీ20 ప్రకటనపై ఉక్రెయిన్‌ ఏమందంటే?

ఈ ప్రత్యేక సందర్భం కోసం చాలా మంది అతిథులు భారతీయత ఉట్టిపడేలా వస్త్రధారణలో విందు చేయడానికి భారత మండపానికి విచ్చేశారు. శనివారం రాత్రి అధ్యక్షుడు ముర్ము ఏర్పాటు విందుకు జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా భార్య యుకో కిషిదా, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా, పలువురు ప్రముఖ విదేశీ ప్రముఖులు సాంప్రదాయ భారతీయ వస్త్రాలను ధరించారు. కిషిదా భార్య యుకో కిషిదా అందమైన ఆకుపచ్చ చీర కట్టుకుంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా భార్య త్షెపో మోట్సెపే ఇండో-వెస్ట్రన్ దుస్తులను ధరించారు. అలాగే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ముత్యాల హారంతో కూడిన చీరలో జాతి శోభను చాటారు.

నోరూరించే రుచులు
రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో భాగంగా అతిథులకు బంగారం, వెండి పాత్రల్లో విందు వడ్డించారు. చిరుధాన్యాలు, పనసపండుతో చేసిన గాలెట్టె( ఫ్రెంచి వంటకం) గ్లేజ్‌డ్‌ ఫారెస్ట్‌ మష్రూమ్‌, చిరుధాన్యాల వంటకాలు, కేరళ రెడ్‌రైస్‌, వివిధ రకాల బ్రెడ్‌లతోపాటు ముంబయి పావ్‌ కూడా అందించారు. డెజర్ట్‌లో యాలకులు, ఊదలతో చేసిన మధురిమ అనే పుడ్డింగ్‌, ఫిగ్‌ పీచ్‌ కంపోట్‌, ఆంబేమొహార్‌ క్రిస్పీస్‌, పాలు-గోధుమలతో చేసిన నట్స్‌ ఉంటాయి. పానీయాల్లో కశ్మీరీ ఖావా, ఫిల్టర్‌ కాఫీ, డార్జిలింగ్‌ టీ, పాన్‌ ఫ్లేవర్డ్‌ చాక్లెట్‌ ఏర్పాటు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharat Mandapam
  • G20 Dinner
  • G20 special dinner
  • G20 Summit
  • G20 Summit 2023

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions