G20 Summit: జీ20 సమ్మిట్లో భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర ప్రపంచ నాయకులు శనివారం జీ20 సమ్మిట్లో భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్ను ప్రారంభించారు. కారిడార్ను ప్రారంభిస్తూ, కనెక్టివిటీ, స్థిరమైన అభివృద్ధికి ఇది కొత్త దిశను ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే కాలంలో ఈ కారిడార్ భారతదేశం, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా మారుతుందని ఆయన అన్నారు.
Also Read: G20 Summit: జీ20లో కీలక పరిణామం.. ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం
Also Read
- 7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Ind Vs SL: ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
- Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు మనందరం ఒక ముఖ్యమైన, చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం చూశామన్నారు. రాబోయే కాలంలో, పశ్చిమాసియా, ఐరోపా మధ్య ఆర్థిక ఏకీకరణకు భారతదేశం సమర్థవంతమైన మాధ్యమం అవుతుందని. ఇది ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ, అభివృద్ధికి స్థిరమైన దిశను అందిస్తుందన్నారు ప్రధాని మోడీ .
కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ఇది నిజంగా పెద్ద విషయమని అన్నారు. ప్రధాని మోడీకి బైడెన్ కృతజ్ఞతలు తెలుపుతూ.. జీ-20 శిఖరాగ్ర సదస్సులో ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు ప్రధానాంశమని అన్నారు. స్థిరమైన, స్థితిస్థాపకమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం, నాణ్యమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులు పెట్టడం, మెరుగైన భవిష్యత్తును సృష్టించడం, దార్శనికతకు కట్టుబడి ఉండటానికి తాము కలిసి వచ్చామన్నారు. ఆర్థిక కారిడార్లలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా అన్ని భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని కొద్ది నెలల క్రితమే ప్రకటించామని చెప్పారు.
Also Read: Morocco Earthquake: 820కి చేరిన మృతుల సంఖ్య.. ఎటూ చూసినా శిథిలాలే..
అంతేకాకుండా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ కూడా ఈ ప్రయోగాన్ని “చారిత్రకమైనది” అని పిలిచారు. ఈ కారిడార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్తో సహా మిడిల్ ఈస్ట్ అంతటా రైల్వేలు, పోర్ట్ సౌకర్యాలను కలుపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం, ఐరోపా మధ్య వాణిజ్యాన్ని 40 శాతం వరకు వేగవంతం చేసే అవకాశం ఈ ప్రాజెక్టుకు ఉంది.ముంబై నుంచి సూయజ్ కెనాల్ ద్వారా యూరప్కు ప్రయాణించే షిప్పింగ్ కంటైనర్ భవిష్యత్తులో రైలు మార్గంలో దుబాయ్ నుండి ఇజ్రాయెల్లోని హైఫాకు, ఆపై యూరప్కు వెళ్లవచ్చు” అని యురేషియా గ్రూప్లోని దక్షిణాసియా ప్రాక్టీస్ హెడ్ ప్రమిత్ పాల్ చౌధురి చెప్పారు. తన అంచనా నిజమైతే డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని చెప్పారు.
తాజావార్తలు
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Ind Vs SL: ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 ప్రో 5G లాంచ్కు రెడీ?.. 8GB RAM, 256GB స్టోరేజ్.. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే!
-
Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!