G20 Summit: జీ20 సమ్మిట్లో భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర ప్రపంచ నాయకులు శనివారం జీ20 సమ్మిట్లో భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ కనెక్టివిటీ కారిడార్ను ప్రారంభించారు. కారిడార్ను ప్రారంభిస్తూ, కనెక్టివిటీ, స్థిరమైన అభివృద్ధికి ఇది కొత్త దిశను ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే కాలంలో ఈ కారిడార్ భారతదేశం, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా మారుతుందని ఆయన అన్నారు.
Also Read: G20 Summit: జీ20లో కీలక పరిణామం.. ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం
Also Read
భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు మనందరం ఒక ముఖ్యమైన, చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం చూశామన్నారు. రాబోయే కాలంలో, పశ్చిమాసియా, ఐరోపా మధ్య ఆర్థిక ఏకీకరణకు భారతదేశం సమర్థవంతమైన మాధ్యమం అవుతుందని. ఇది ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ, అభివృద్ధికి స్థిరమైన దిశను అందిస్తుందన్నారు ప్రధాని మోడీ .
కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ఇది నిజంగా పెద్ద విషయమని అన్నారు. ప్రధాని మోడీకి బైడెన్ కృతజ్ఞతలు తెలుపుతూ.. జీ-20 శిఖరాగ్ర సదస్సులో ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు ప్రధానాంశమని అన్నారు. స్థిరమైన, స్థితిస్థాపకమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం, నాణ్యమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులు పెట్టడం, మెరుగైన భవిష్యత్తును సృష్టించడం, దార్శనికతకు కట్టుబడి ఉండటానికి తాము కలిసి వచ్చామన్నారు. ఆర్థిక కారిడార్లలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా అన్ని భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని కొద్ది నెలల క్రితమే ప్రకటించామని చెప్పారు.
Also Read: Morocco Earthquake: 820కి చేరిన మృతుల సంఖ్య.. ఎటూ చూసినా శిథిలాలే..
అంతేకాకుండా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ కూడా ఈ ప్రయోగాన్ని “చారిత్రకమైనది” అని పిలిచారు. ఈ కారిడార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్తో సహా మిడిల్ ఈస్ట్ అంతటా రైల్వేలు, పోర్ట్ సౌకర్యాలను కలుపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం, ఐరోపా మధ్య వాణిజ్యాన్ని 40 శాతం వరకు వేగవంతం చేసే అవకాశం ఈ ప్రాజెక్టుకు ఉంది.ముంబై నుంచి సూయజ్ కెనాల్ ద్వారా యూరప్కు ప్రయాణించే షిప్పింగ్ కంటైనర్ భవిష్యత్తులో రైలు మార్గంలో దుబాయ్ నుండి ఇజ్రాయెల్లోని హైఫాకు, ఆపై యూరప్కు వెళ్లవచ్చు” అని యురేషియా గ్రూప్లోని దక్షిణాసియా ప్రాక్టీస్ హెడ్ ప్రమిత్ పాల్ చౌధురి చెప్పారు. తన అంచనా నిజమైతే డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని చెప్పారు.
తాజావార్తలు
-
Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?
-
Kalahandi Issues: డిజిటల్ ఇండియాలో ‘మంచమే’ అంబులెన్స్.. గర్భిణిని కిలోమీటరు మోసుకెళ్లిన గ్రామస్థులు!
-
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?
-
Thalapathy Vijay: విజయ్ ‘పట్టాభిషేకానికి’ ఊపిరి పోస్తున్న 32 ఏళ్ల నాటి ‘బొమ్మై’ తీర్పు! తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్..
-
Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..