ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇక, రేపు తుఫ్రాన్, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అలాగే, ఎల్లుండి మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో రోడ్డు షోలో మాట్లాడనున్నారు.
Indrakaran Reddy: మా ఓట్లు కావాలి కానీ, మా నిర్మల్ అభివృద్ధి మీకు పట్టదా? ప్రధాని మోడీ ఏ మొహం పెట్టుకుని నిర్మల్ కు వస్తున్నారు? అని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ 7వ ఎడిషన్ కోసం దరఖాస్తులను త్వరలోనే ఆహ్వనించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో రెండు గంటల పాటు ప్రధాని మోడీ చర్చించనున్నారు.
Shivraj Singh Chouhan: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో భారత్ ఆస్ట్రేలియాపై ఓడిపోవడం రాజకీయ అస్త్రంగా మారింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇటీవల రాజస్థాన్ జలోర్లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీపై ‘పనౌటీ’(చెడుశకునం) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. రాహుల్ గాంధీ మానసిక స్థితి సరిగా లేదంటూ బీజేపీ విమర్శించింది.
Congress: కేరళలో అధికార సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా మద్దతు ర్యాలీలు చేపడుతున్నాయి. గురువారం కాంగ్రెస్ నేతృత్వంలో కోజికోడ్లో పాలస్తీనా సంఘీభావ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్తో పాటు మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ హాజరయ్యారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్రమోడీలు ఇద్దరు ఒకే రకం అని ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన ‘పనౌటీ’(చెడు శకునం) వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది.
PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ... ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాది ప్రధాని నరేంద్రమోడీ మరోసారి నొక్కి చెప్పారు. బుధవారం జీ 20 సమ్మిట్ వర్చువల్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు జీ 20 సభ్య దేశాలతో కలిసి నడవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇజ్రాయిల్- హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందాన్ని ప్రధాని మోడీ స్వాగతించారు.
PM Modi: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 25న జరగబోతున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేస్తున్నాయి. ఈ సారి అధికారమే ధ్యేయంగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి చేసిందని, తాము అధికారంలోకి వస్తే అన్నీ బయటకు తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
PM Modi: ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్(AI) వేగవంతమైన వృద్ధితో భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని, వీటిని సరిగా పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలునిచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జీ-20 దేశాలు సంయుక్తంగా పనిచేయాలని కోరారు. బుధవారం వర్చువల్గా జరిగిన జీ 20 సమ్మిట్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ప్రస్తుతం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయాలని సూచించారు. ఏఐ ప్రజలకు చేరువకావాలి.. ఇది సమాజానికి సురక్షితంగా ఉండాలని ప్రధాని అన్నారు.