CPI Narayana: దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు..? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్ CPI ఆఫీస్ లో CPI 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ నేతలు నారాయణ, సురవరం, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కునమనేని సాంబశవరావు హాజరయ్యారు. వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా CPI నేతలు జెండా విష్కరించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. 1917 కు ముందు విశ్వంలో ఒకే గ్లోబ్ ఉండేదన్నారు. 1917 సోవియట్ విప్లవం వచ్చిన తరువాత విశ్వంలో ఒక ఎర్ర చుక్క పొడిచిందన్నారు. సోవియట్ విప్లవం ఒక గుణాత్మకమైన మార్పు వస్తుందని అన్నారు. బ్రిటీష్ దొరలను తరమాలని అనుకున్నారు తప్ప ఎలాంటి స్వాతంత్ర్యం కావాలని ఎవరు అనుకోలేదన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తరువాతే స్పష్టమైన స్వాతంత్ర్య రాజ్యాంగ దేశం ఏర్పడిందన్నారు. దున్నే వాడికి భూమి కావాలనే ఉద్యమం నుంచి సాయుధ పోరాటంతో వరకు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిర్భాందాలను ఎదుర్కొందన్నారు.
Read also: Tiger in Pilibhit: వీధుల్లో షికారు చేస్తున్న పులి.. భయంతో మేడలెక్కిన జనం
Also Read
- Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
- Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
దేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం.. భిన్నత్వంలో ఏకత్వంలా దేశం బలంగా ఉండాలని కోరుకుంటామన్నారు. ఇవాళ దేశం విచ్ఛిన్నo చేసేందుకు విభజించు పాలించు అనే పద్ధతిలో పాలక గణాలు, ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు. కులాలు, మతాల పేరు మీద దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందన్నారు. స్వతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర లేదని అన్నారు. దేశ స్వాతంత్ర్యoలో కమ్యూనిస్ట్ పార్టీ వేల మంది అమరులను పోగొట్టుకుందని తెలిపారు. వారసత్వ ఉద్యమం స్ఫూర్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. దేశం విచ్ఛిన్నం అవుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ.. కానీ అదే ఆద్వానిని రామ మందిర ప్రారొంబొత్సవానికి రావొద్దని చెప్పారని తెలిపారు. బీజేపీ మోస్ట్ క్రిమినల్ గవర్ణమెంట్ అన్నారు. క్రిమినల్ గ్యాంగ్, మోడీ, అమిత్ షా, అని మండిపడ్డారు. క్రిమినల్ గ్యాంగ్ దేశాన్ని పరిపాలిస్తోందన్నారు. దేశ సంపదను ఆదాని చేతికి అప్పజెతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమని చెప్తున్నారని అన్నారు. ఉప చట్టాలను మరింత ప్రమాదకరoగా తయారుచేస్తున్నారని తెలిపారు. దేశానికి రైట్ వింగ్ ప్రమాదకరమా..? అని ప్రశ్నించారు.
Read also: Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయి
లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమా అనేది తెల్సుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని ద్వంసం చేస్తున్నారని అన్నారు. మనుధర్మాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ తో పాటు విచారణ సంస్థల్ని పెంపుడు కుక్కల్లా తయారు చేశారని అన్నారు. ఇండియా పేరు చూసి మోడీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా కాషాయ మయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్లమెంట్ పై దాడి జరిగిందన్నారు. దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎట్లా ఇచ్చారు? అని ప్రశ్నించారు. పాసులిచ్చిన బీజేపీ ఎంపీ పై చర్యలు తీసుకోకుండా నిరసన తెలిపిన సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. పై స్థాయిలో బిల్లులను అమొదించుకోవడానికి పార్లమెంట్ పై దాడికి ప్లాన్ చేసుకున్నారని తెలిపారు. దేశాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మోడీ ప్రజాస్వామ్యాన్ని తెచ్చెందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ కార్డు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తింపు ఉంటదన్నారు.
Vishal: న్యూయార్క్ లో ఆమెతో చెట్టాపట్టాల్.. కెమెరా చూసి ముఖం దాచి పరిగెత్తిన విశాల్?
తాజావార్తలు
-
Explainer: అర్థరాత్రి ముఖంపై వాలిన గబ్బిలం.. మూడు వారాల్లో పోయిన బాలుడి ప్రాణం..అసలేం జరిగింది?
-
Ketan Agarwal Murder Case: పెళ్లే జరగదు.. అయినా టికెట్లు బుక్ చేయాలి: సియా స్నాప్చాట్ వైరల్
-
Abrar Ahmed: కావ్య మారన్కు బిగ్ షాక్.. చిక్కుల్లో పాక్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్.. రూ. 2.3 కోట్లు స్వాహా!
-
Deepa Thomas: స్టేజ్ మీదే ఏడ్చేసిన ‘రావు బహదూర్’ హీరోయిన్..
-
Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..