Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cpi Narayana Fire On Bjp Government

CPI Narayana: దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు..?

Published Date :December 26, 2023 , 1:55 pm
By Bhanu
CPI Narayana: దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

CPI Narayana: దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు..? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్ CPI ఆఫీస్ లో CPI 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ నేతలు నారాయణ, సురవరం, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కునమనేని సాంబశవరావు హాజరయ్యారు. వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా CPI నేతలు జెండా విష్కరించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. 1917 కు ముందు విశ్వంలో ఒకే గ్లోబ్ ఉండేదన్నారు. 1917 సోవియట్ విప్లవం వచ్చిన తరువాత విశ్వంలో ఒక ఎర్ర చుక్క పొడిచిందన్నారు. సోవియట్ విప్లవం ఒక గుణాత్మకమైన మార్పు వస్తుందని అన్నారు. బ్రిటీష్ దొరలను తరమాలని అనుకున్నారు తప్ప ఎలాంటి స్వాతంత్ర్యం కావాలని ఎవరు అనుకోలేదన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తరువాతే స్పష్టమైన స్వాతంత్ర్య రాజ్యాంగ దేశం ఏర్పడిందన్నారు. దున్నే వాడికి భూమి కావాలనే ఉద్యమం నుంచి సాయుధ పోరాటంతో వరకు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిర్భాందాలను ఎదుర్కొందన్నారు.

Read also: Tiger in Pilibhit: వీధుల్లో షికారు చేస్తున్న పులి.. భయంతో మేడలెక్కిన జనం

దేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం.. భిన్నత్వంలో ఏకత్వంలా దేశం బలంగా ఉండాలని కోరుకుంటామన్నారు. ఇవాళ దేశం విచ్ఛిన్నo చేసేందుకు విభజించు పాలించు అనే పద్ధతిలో పాలక గణాలు, ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు. కులాలు, మతాల పేరు మీద దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందన్నారు. స్వతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర లేదని అన్నారు. దేశ స్వాతంత్ర్యoలో కమ్యూనిస్ట్ పార్టీ వేల మంది అమరులను పోగొట్టుకుందని తెలిపారు. వారసత్వ ఉద్యమం స్ఫూర్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. దేశం విచ్ఛిన్నం అవుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ.. కానీ అదే ఆద్వానిని రామ మందిర ప్రారొంబొత్సవానికి రావొద్దని చెప్పారని తెలిపారు. బీజేపీ మోస్ట్ క్రిమినల్ గవర్ణమెంట్ అన్నారు. క్రిమినల్ గ్యాంగ్, మోడీ, అమిత్ షా, అని మండిపడ్డారు. క్రిమినల్ గ్యాంగ్ దేశాన్ని పరిపాలిస్తోందన్నారు. దేశ సంపదను ఆదాని చేతికి అప్పజెతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమని చెప్తున్నారని అన్నారు. ఉప చట్టాలను మరింత ప్రమాదకరoగా తయారుచేస్తున్నారని తెలిపారు. దేశానికి రైట్ వింగ్ ప్రమాదకరమా..? అని ప్రశ్నించారు.

Read also: Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయి

లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమా అనేది తెల్సుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని ద్వంసం చేస్తున్నారని అన్నారు. మనుధర్మాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ తో పాటు విచారణ సంస్థల్ని పెంపుడు కుక్కల్లా తయారు చేశారని అన్నారు. ఇండియా పేరు చూసి మోడీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా కాషాయ మయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్లమెంట్ పై దాడి జరిగిందన్నారు. దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎట్లా ఇచ్చారు? అని ప్రశ్నించారు. పాసులిచ్చిన బీజేపీ ఎంపీ పై చర్యలు తీసుకోకుండా నిరసన తెలిపిన సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. పై స్థాయిలో బిల్లులను అమొదించుకోవడానికి పార్లమెంట్ పై దాడికి ప్లాన్ చేసుకున్నారని తెలిపారు. దేశాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మోడీ ప్రజాస్వామ్యాన్ని తెచ్చెందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ కార్డు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తింపు ఉంటదన్నారు.
Vishal: న్యూయార్క్ లో ఆమెతో చెట్టాపట్టాల్.. కెమెరా చూసి ముఖం దాచి పరిగెత్తిన విశాల్?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp government
  • CPI Narayana fire
  • CPI Narayana fire on BJP government
  • modi
  • PM Modi

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions