CPI Narayana: దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎలా ఇచ్చారు..? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్ CPI ఆఫీస్ లో CPI 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ నేతలు నారాయణ, సురవరం, చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కునమనేని సాంబశవరావు హాజరయ్యారు. వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా CPI నేతలు జెండా విష్కరించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. 1917 కు ముందు విశ్వంలో ఒకే గ్లోబ్ ఉండేదన్నారు. 1917 సోవియట్ విప్లవం వచ్చిన తరువాత విశ్వంలో ఒక ఎర్ర చుక్క పొడిచిందన్నారు. సోవియట్ విప్లవం ఒక గుణాత్మకమైన మార్పు వస్తుందని అన్నారు. బ్రిటీష్ దొరలను తరమాలని అనుకున్నారు తప్ప ఎలాంటి స్వాతంత్ర్యం కావాలని ఎవరు అనుకోలేదన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తరువాతే స్పష్టమైన స్వాతంత్ర్య రాజ్యాంగ దేశం ఏర్పడిందన్నారు. దున్నే వాడికి భూమి కావాలనే ఉద్యమం నుంచి సాయుధ పోరాటంతో వరకు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిర్భాందాలను ఎదుర్కొందన్నారు.
Read also: Tiger in Pilibhit: వీధుల్లో షికారు చేస్తున్న పులి.. భయంతో మేడలెక్కిన జనం
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
దేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం.. భిన్నత్వంలో ఏకత్వంలా దేశం బలంగా ఉండాలని కోరుకుంటామన్నారు. ఇవాళ దేశం విచ్ఛిన్నo చేసేందుకు విభజించు పాలించు అనే పద్ధతిలో పాలక గణాలు, ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు. కులాలు, మతాల పేరు మీద దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందన్నారు. స్వతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర లేదని అన్నారు. దేశ స్వాతంత్ర్యoలో కమ్యూనిస్ట్ పార్టీ వేల మంది అమరులను పోగొట్టుకుందని తెలిపారు. వారసత్వ ఉద్యమం స్ఫూర్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. దేశం విచ్ఛిన్నం అవుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ.. కానీ అదే ఆద్వానిని రామ మందిర ప్రారొంబొత్సవానికి రావొద్దని చెప్పారని తెలిపారు. బీజేపీ మోస్ట్ క్రిమినల్ గవర్ణమెంట్ అన్నారు. క్రిమినల్ గ్యాంగ్, మోడీ, అమిత్ షా, అని మండిపడ్డారు. క్రిమినల్ గ్యాంగ్ దేశాన్ని పరిపాలిస్తోందన్నారు. దేశ సంపదను ఆదాని చేతికి అప్పజెతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమని చెప్తున్నారని అన్నారు. ఉప చట్టాలను మరింత ప్రమాదకరoగా తయారుచేస్తున్నారని తెలిపారు. దేశానికి రైట్ వింగ్ ప్రమాదకరమా..? అని ప్రశ్నించారు.
Read also: Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయి
లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమా అనేది తెల్సుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని ద్వంసం చేస్తున్నారని అన్నారు. మనుధర్మాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ తో పాటు విచారణ సంస్థల్ని పెంపుడు కుక్కల్లా తయారు చేశారని అన్నారు. ఇండియా పేరు చూసి మోడీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా కాషాయ మయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్లమెంట్ పై దాడి జరిగిందన్నారు. దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎట్లా ఇచ్చారు? అని ప్రశ్నించారు. పాసులిచ్చిన బీజేపీ ఎంపీ పై చర్యలు తీసుకోకుండా నిరసన తెలిపిన సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. పై స్థాయిలో బిల్లులను అమొదించుకోవడానికి పార్లమెంట్ పై దాడికి ప్లాన్ చేసుకున్నారని తెలిపారు. దేశాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మోడీ ప్రజాస్వామ్యాన్ని తెచ్చెందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ కార్డు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తింపు ఉంటదన్నారు.
Vishal: న్యూయార్క్ లో ఆమెతో చెట్టాపట్టాల్.. కెమెరా చూసి ముఖం దాచి పరిగెత్తిన విశాల్?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!