ఎన్డీఏ నేతగా నరేంద్ర మోడీ పేరును బలపరుస్తూ మాట్లాడిన పవన్ కల్యాణ్.. దేశానికి మోడీ ఒక స్ఫూర్తిగా అభివర్ణించారు.. యావత్ దేశానికి మీరు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.. ఇక, నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామన్నారు.
మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ కు అత్యంత కీలక బాధ్యత దక్కే దక్కనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్ను నియమిస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుంది.
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు ( శనివారం) సమావేశం కాబోతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జూన్ 8వ తేదీన ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.
ఇదిలా ఉంటే రెండు దేశాలు మాత్రమే మరోసారి అధికారం చేపట్టబోతున్న నరేంద్రమోడీకి రెండు దేశాలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అభినందనలు తెలియజేయలేదు. పాకిస్తాన్, టర్కీలు ఇప్పటికీ ఎలాంటి సందేశాన్ని తెలియజేయలేదు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ప్రధాని మోడీకి ఆయా దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియచేశారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాకుండా ఉక్రెయిన్లో పర్యటించాలని ఆహ్వానం పలికారు.
మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
BJP: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 543 లోక్సభ సీట్లలో 293 సీట్లను ఎన్డీయే కైవసం చేసుకుంది. 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి సీట్లను కైవసం చేసుకుంది.
సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమవుతున్నారు. ఇక 2014 తరువాత తొలిసారిగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేక పోయింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 293 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి పక్షాల మద్దతుతోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో దేశంలో మరో ఐదేళ్లు మోదీ 3.O పాలన సాగనుంది. జూన్ 9వ…