President Droupadi Murmu Congratulates Neeraj Chopra For Olympic Silver: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 89.45 మీటర్లు విసిరి రజత పతకం కైసవం చేసుకున్నాడు. పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. ఇక గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు. సిల్వర్…
PM Modi: షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్లో నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. బాధ్యతలు స్వీకరించిన యూనస్కి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్లో త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. జట్టు విజయం సాధించినందుకు మోడీ అభినందనలు తెలిపారు. జట్టు అనుభవజ్ఞుడైన గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్కు ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశారు. శ్రీజేష్కి ఇదే చివరి మ్యాచ్ కావడంతో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికాడు.
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు స్పెయిన్ను 2-1తో ఓడించింది. దీంతో.. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాగా.. విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కాంస్య పతకం సాధించిన భారత జట్టుపై మోడీ గురువారం ప్రశంసలు కురిపించారు. ఈ ఘనత రాబోయే తరాలకు గుర్తుండిపోతుందని కొనియాడారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా చేనేత వస్త్రంపై ఒక చేనేత కుటుంబంలోని దంపతులతో మోడీ లఘు చిత్రాన్ని నేయించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ స్వయంగా ప్రధానికి బహుకరించారు.
ఏపీ విజన్ డాక్యుమెంట్- 2047 రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. అధికారులతో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశం అయ్యారు.. విజన్ డాక్యుమెంటులో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు..
Mallikarjun Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో గవర్నర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు