Modi US Visit: వచ్చే నెల అమెరికాకు మోడీ.. యూఎస్ ఎన్నికల ముందు కీలక పర్యటన..
- వచ్చే నెల అమెరికాకు ప్రధాని నరేంద్రమోడీ..
- ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరు..
- ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొననున్న మోడీ..
Modi US Visit: ఐక్యరాజ్యసమితి వార్షిక సదస్సు కోసం వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరంలో జరగబోయే ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత, అక్కడే ప్రవాస భారతీయులు నిర్వహించే భారీ సమావేశానికి మోడీ హాజరు కానున్నారు. అయితే, యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఆ దేశ నాయకులు ఎవరూ పాల్గొనరని సమాచారం. అయితే, అమెరికా ఎన్నికల ముందు ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 18000 మంది హాజరయ్యే అవకాశం ఉన్న లాంగ్ ఐలాండ్లోని ఓపెన్ ఎయిర్ వేదికలో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించబడుతుందని ఆయా వర్గాలు తెలిపాయి.
Read Also: Congress: ప్రధాని ‘‘కమ్యూనిల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు..
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’తో ప్రారంభమయ్యే సెప్టెంబర్ 22 నుండి 28 వరకు ఐక్యరాజ్యసమితిలో ఉన్నత స్థాయి సమావేశాల కోసం మోడీ న్యూయార్క్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 26న జరిగే జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తారు. అయితే, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నందున, అక్కడి దేశీయ రాజకీయాలపై ప్రభావం ఉండకూడదని, అమెరికా రాజకీయ నాయకులు ఈ సమావేశాలకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.
2019లో అప్పటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ప్రధాని మోడీ-డొనాల్డ్ ట్రంప్ హ్యూస్టన్లో జరిగిన భారీ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో మోడీ ‘‘అబ్కీ బార్ ట్రంప్ సర్కార్’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పటి ఎన్నికల్లో సంచలనంగా మారాయి. అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి జో బైడెన్ గెలిచారు. మోడీ సమావేశంలో పాల్గొనే యూఎస్ నాయకులు తటస్థంగా ఉండాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. హ్యూస్టన్ సమావేశానికి ముందు సెప్టెంబర్ 2014లో తన మొదటి ఎన్నిలక విజయం తర్వాత ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళ్లారు. ఆ తర్వాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో దాదాపు 20,000 మందితో నిండిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మరుసటి సంవత్సరం, అతను శాన్ జోస్లో డయాస్పోరాతో సామూహిక సమావేశాన్ని నిర్వహించాడు. గతేడాది ఐరాసలో జరిగిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మాస్ ఎక్సర్సైజ్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!