Independence Day 2024: ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలు.. జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
- ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలు
- జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ
- జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Independence Day 2024: దేశం ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రసంగించారు. ప్రధాని మోడీ ఉదయాన్నే రాజ్ఘాట్కు చేరుకుని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రధాని ఎర్రకోటకు చేరుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగం ప్రారంభించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.”దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించే రోజు ఈ రోజు. ఈ దేశం వారికి రుణపడి ఉంటుంది” అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్..
Also Read
దేశం కోసం ప్రాణాలు వదిలిన మహనీయులకు ఈ దేశం రుణపడి ఉందన్నారు. దేశానికి స్వేచ్ఛావాయువులు అందించిన త్యాగధనుల స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమన్నారు. 40 కోట్ల మంది స్వతంత్రాన్ని సాధిస్తే.. 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగదా అభివృద్ధి పథంలో వెళ్తున్నామన్నారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగాలన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందులు పెడుతున్నాయని ప్రధాని వెల్లడించారు.ఇటీవలి ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించారు. వైపరీత్యాలకు ప్రభావితమైన వారికి తన సానుభూతిని తెలియజేశారు. ఈ సంక్షోభ సమయంలో ఈ దేశం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భారత్ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలన్నారు. తయారీ రంగంలో భారత్ గ్లోబల్ హబ్గా మారాలని మోడీ ఆకాంక్షించారు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.
దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు అవసరమన్నారు. దళితులు, ఆదివాసీలు దేశంలో గౌరవంగా బతకాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రపంచానికే భారత్ అన్నం పెట్టే స్థాయికి ఎదగాలన్నారు. సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని మోడీ వెల్లడించారు. యువతకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. బ్యాంకింగ్లో ఎన్నో సంస్కరణలు వచ్చాయన్నారు. ప్రపంచ స్థాయిలో మన బ్యాంకులను బలోపేతం చేశామన్నారు. వోకల్ ఫర్ లోకల్ నినాదం భారత ఆర్థిక వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిందని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే భారత్ ఇప్పుడు శక్తవంతంగా మారిందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతమైతే మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైనదన్నారు.
సర్జికల్ స్ట్రైక్ను ప్రజలు స్మరించుకుంటున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తయారీ రంగంలో భారత్ గ్లోబల్ హబ్గా మారాలన్నారు. మోడీ ప్రభుత్వం పెద్ద సంస్కరణలకు కట్టుబడి ఉందని 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు జీవితాలను మార్చడానికి, దేశాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ముఖ్యమైన సంస్కరణలను అమలు చేయడంలో ప్రభుత్వ అంకితభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. “సంస్కరణల పట్ల మా నిబద్ధత తాత్కాలిక ప్రశంసల కోసం లేదా బలవంతం కోసం కాదు, దేశాన్ని బలోపేతం చేయాలనే సంకల్పం” అని ఆయన అన్నారు.
మహిళలను లక్షాధికారులను చేస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 10 కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరారన్నారు. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్నారు. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్ద పీట వేశామని ప్రధాని తెలిపారు. మౌలిక సదుపాయాల్లో అనూహ్య మార్పులు తీసుకువచ్చామన్నారు. నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. మాతృభాషను ఎవరూ విస్మరించవద్దని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!