PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి డొమినికా అత్యున్నత పురస్కారం..
- ప్రధాని నరేంద్రమోడీకి డొమినికా అత్యున్నత పురస్కారం..
- ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’ని ప్రధానం చేసిన కరేబియన్ దేశం..
- కోవిడ్-19 సమయంలో భారత్ ఇచ్చిన మద్దతుకు గుర్తింపుగా అవార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమకు చేసిన సహాయానికి కరేబియన్ దేశం డొమినికా ప్రధాని నరేంద్రమోడీకి అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసినందుకు గుర్తింపుగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’ని ప్రధానం చేసింది. నవంబర్ 19 నుండి 21 వరకు గయానాలోని జార్జ్టౌన్లో జరగనున్న ఇండియా-కారికామ్ సమ్మిట్ సందర్భంగా కామన్వెల్త్ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ అవార్డును ప్రదానం చేస్తారని డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Team India: టీ20ల్లో భారత్ విజృంభణ.. ఆస్ట్రేలియా రికార్డు సమం
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
‘‘ఫిబ్రవరి 2021లో, ప్రధానమంత్రి మోడీ డొమినికాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ను సరఫరా చేసారు – ఇది డొమినికా తన కరేబియన్ పొరుగువారికి మద్దతునిచ్చేందుకు వీలు కల్పించింది” అని ప్రకటన పేర్కొంది. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డొమినికాకు భారత్ చాలా మద్దతు అందిస్తోంది. మోడీ చేసిన ఈ కృషికి ఈ అవార్డును ఇస్తోంది. డొమినికా ప్రాంతానికి ప్రధాని మోడీ సంఘీభావం తెలిపినందుకు ఈ అవార్డుని తమ దేశం థాంక్స్ తెలియజేస్తోందని డొమినికా ప్రధాని రూజ్ వెల్ట్ స్కెరిట్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ అవార్డు ప్రతిపాదనను అంగీకరిస్తూ, వాతావరణ మార్పు మరియు భౌగోళిక రాజకీయ సంఘర్షణల వంటి సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని మోదీ హైలైట్ చేశారు మరియు ఈ సమస్యలను పరిష్కరించడంలో డొమినికా మరియు కరేబియన్లతో కలిసి పనిచేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ధృవీకరించారు. భారత్-కారికోమ్ సమ్మిట్కి ప్రెసిడెంట్ బర్టన్ , ప్రధాని స్కెరిట్ హాజరవుతారు. ఈ సమావేశంలో భారత్, కరేబియన్ కమ్యూనిటీ(కారికోమ్) సభ్యదేశాల మధ్య సహకారం, ప్రాధాన్యతలు, అవకాశాల గురించి చర్చిస్తారు.
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!