PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి డొమినికా అత్యున్నత పురస్కారం..
- ప్రధాని నరేంద్రమోడీకి డొమినికా అత్యున్నత పురస్కారం..
- ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’ని ప్రధానం చేసిన కరేబియన్ దేశం..
- కోవిడ్-19 సమయంలో భారత్ ఇచ్చిన మద్దతుకు గుర్తింపుగా అవార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమకు చేసిన సహాయానికి కరేబియన్ దేశం డొమినికా ప్రధాని నరేంద్రమోడీకి అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసినందుకు గుర్తింపుగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’ని ప్రధానం చేసింది. నవంబర్ 19 నుండి 21 వరకు గయానాలోని జార్జ్టౌన్లో జరగనున్న ఇండియా-కారికామ్ సమ్మిట్ సందర్భంగా కామన్వెల్త్ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ అవార్డును ప్రదానం చేస్తారని డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Team India: టీ20ల్లో భారత్ విజృంభణ.. ఆస్ట్రేలియా రికార్డు సమం
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
‘‘ఫిబ్రవరి 2021లో, ప్రధానమంత్రి మోడీ డొమినికాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ను సరఫరా చేసారు – ఇది డొమినికా తన కరేబియన్ పొరుగువారికి మద్దతునిచ్చేందుకు వీలు కల్పించింది” అని ప్రకటన పేర్కొంది. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డొమినికాకు భారత్ చాలా మద్దతు అందిస్తోంది. మోడీ చేసిన ఈ కృషికి ఈ అవార్డును ఇస్తోంది. డొమినికా ప్రాంతానికి ప్రధాని మోడీ సంఘీభావం తెలిపినందుకు ఈ అవార్డుని తమ దేశం థాంక్స్ తెలియజేస్తోందని డొమినికా ప్రధాని రూజ్ వెల్ట్ స్కెరిట్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ అవార్డు ప్రతిపాదనను అంగీకరిస్తూ, వాతావరణ మార్పు మరియు భౌగోళిక రాజకీయ సంఘర్షణల వంటి సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని మోదీ హైలైట్ చేశారు మరియు ఈ సమస్యలను పరిష్కరించడంలో డొమినికా మరియు కరేబియన్లతో కలిసి పనిచేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ధృవీకరించారు. భారత్-కారికోమ్ సమ్మిట్కి ప్రెసిడెంట్ బర్టన్ , ప్రధాని స్కెరిట్ హాజరవుతారు. ఈ సమావేశంలో భారత్, కరేబియన్ కమ్యూనిటీ(కారికోమ్) సభ్యదేశాల మధ్య సహకారం, ప్రాధాన్యతలు, అవకాశాల గురించి చర్చిస్తారు.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!