PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి డొమినికా అత్యున్నత పురస్కారం..
- ప్రధాని నరేంద్రమోడీకి డొమినికా అత్యున్నత పురస్కారం..
- ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’ని ప్రధానం చేసిన కరేబియన్ దేశం..
- కోవిడ్-19 సమయంలో భారత్ ఇచ్చిన మద్దతుకు గుర్తింపుగా అవార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమకు చేసిన సహాయానికి కరేబియన్ దేశం డొమినికా ప్రధాని నరేంద్రమోడీకి అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసినందుకు గుర్తింపుగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’ని ప్రధానం చేసింది. నవంబర్ 19 నుండి 21 వరకు గయానాలోని జార్జ్టౌన్లో జరగనున్న ఇండియా-కారికామ్ సమ్మిట్ సందర్భంగా కామన్వెల్త్ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ అవార్డును ప్రదానం చేస్తారని డొమినికన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Team India: టీ20ల్లో భారత్ విజృంభణ.. ఆస్ట్రేలియా రికార్డు సమం
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
‘‘ఫిబ్రవరి 2021లో, ప్రధానమంత్రి మోడీ డొమినికాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ను సరఫరా చేసారు – ఇది డొమినికా తన కరేబియన్ పొరుగువారికి మద్దతునిచ్చేందుకు వీలు కల్పించింది” అని ప్రకటన పేర్కొంది. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డొమినికాకు భారత్ చాలా మద్దతు అందిస్తోంది. మోడీ చేసిన ఈ కృషికి ఈ అవార్డును ఇస్తోంది. డొమినికా ప్రాంతానికి ప్రధాని మోడీ సంఘీభావం తెలిపినందుకు ఈ అవార్డుని తమ దేశం థాంక్స్ తెలియజేస్తోందని డొమినికా ప్రధాని రూజ్ వెల్ట్ స్కెరిట్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ అవార్డు ప్రతిపాదనను అంగీకరిస్తూ, వాతావరణ మార్పు మరియు భౌగోళిక రాజకీయ సంఘర్షణల వంటి సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని మోదీ హైలైట్ చేశారు మరియు ఈ సమస్యలను పరిష్కరించడంలో డొమినికా మరియు కరేబియన్లతో కలిసి పనిచేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ధృవీకరించారు. భారత్-కారికోమ్ సమ్మిట్కి ప్రెసిడెంట్ బర్టన్ , ప్రధాని స్కెరిట్ హాజరవుతారు. ఈ సమావేశంలో భారత్, కరేబియన్ కమ్యూనిటీ(కారికోమ్) సభ్యదేశాల మధ్య సహకారం, ప్రాధాన్యతలు, అవకాశాల గురించి చర్చిస్తారు.
తాజావార్తలు
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!