PM Modi: నైజీరియాకు చేరుకున్న ప్రధాని మోడీ.. కీలక అంశాలపై చర్చ
- మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియాకు చేరుకున్న ప్రధాని మోడీ..
- ప్రధాన మంత్రి మోడీకి ఘన స్వాగతం పలికిన నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు..
- నవంబర్ 18-19లో బ్రెజిల్ లో జరగనున్న జీ-20 సమ్మిట్ లో పాల్గొననున్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 3 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలుత నైజీరియా చేరుకున్నారు. ఈ సందర్బంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. నైజీరియాలో ఉన్న ప్రవాస భారతీయులు మోడీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో భారత ప్రధాని వారికి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. కాగా, ఈ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ నేడు (ఆదివారం) నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో సమావేశం కానున్నారు. ఆ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఆ తర్వాత జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోడీ బ్రెజిల్ వెళ్లనున్నారు. ఈ సదస్సు సందర్భంగా జీ-20 దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.
Read Also: Pushpa – 2 : RRR ట్రైలర్ రికార్డును పుష్ప – 2 బ్రేక్ చేసేనా..?
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
అలాగే, ఈ నెల 19వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గయానాకు వెళ్లనున్నారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉండనున్నారు. గయానాలో జరగనున్న భారత్- కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని భారత ప్రధానికి ప్రదానం చేయనుంది. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించటం గమనార్హం.
Read Also: Koti Deepotsavam 2024 Day 8 : సకలాభీష్టాలు ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం
ఇక, నవంబర్ 18, 19 తేదీల్లో రియో డీజెనిరోలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా జీ-20 ట్రోకాలో భాగంగా కొనసాగుతున్నాయి. గతేడాది భారత్లో జీ-20 సదస్సు జరిగ్గా.. ఇప్పుడు బ్రెజిల్లో జరగబోతుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 కూటమి శిఖరాగ్ర సమావేశం కానుంది.
తాజావార్తలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..