PM Modi: గిరిజన వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉంది
- గిరిజన వారసత్వాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాం
- ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ ప్రభుత్వం అదృష్టం
- బీహార్ సభలో ప్రధాని మోడీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిరిజన వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. బీహార్లో జరిగిన సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆదివాసీ మహిళకు తమ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించిందని తెలిపారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ ప్రభుత్వం అదృష్టంగా భావిస్తోందని చెప్పారు. ముర్ము పేరు ప్రకటించగానే ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ దేశం మొత్తానికి పిలుపునిచ్చారని ప్రధాని గుర్తుచేశారు. ఆదివాసీల కష్టాలను తీర్చేందుకు పీఎం జన్మన్ యోజన పథకం ద్వారా రూ.24వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. గిరిజన కళ మరియు సంస్కృతికి అంకితమైన అనేక మందిని పద్మ అవార్డులతో సత్కరించినట్లు చెప్పారు. రాంచీలోని బిర్సా ముండా, శ్రీనగర్, సిక్కింలో రెండు గిరిజన పరిశోధనా కేంద్రాలను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. లేహ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోవా రిగ్పా, అరుణాచల్లో నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రీసెర్చ్లను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Off The Record: కేటీఆర్ ఢిల్లీ టూర్లో అసలు జరిగిందేంటి..?
Also Read
- Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
గత ప్రభుత్వాలు వెనకబడిన వర్గాల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని.. వారి అభివృద్ధి కోసం కృషి చేయలేదని ప్రధాని విమర్శించారు. సమాజానికి దూరంగా నివసిస్తున్న ఆదివాసీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వారు పండించే దాదాపు 90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇచ్చామన్నారు. ఆదివాసీ యువత క్రీడలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని.. వారిని మరింత ప్రోత్సహించడానికి అనేక క్రీడా సౌకర్యాలను ప్రారంభిస్తున్నామని మోడీ తెలిపారు.
#WATCH | Jamui, Bihar: Prime Minister Narendra Modi says "…Our government has also taken many steps to preserve tribal heritage. Many people dedicated to tribal art and culture have been honoured with Padma Awards. We started a huge museum in the name of Lord Birsa Munda in… pic.twitter.com/4hfFIaevpu
— ANI (@ANI) November 15, 2024
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్ను మార్చేసింది.. చైతూ, అఖిల్కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!