Trade Talks: అమెరికా, భారత్ మధ్య సంబంధాలను ‘‘సుంకాలు’’ దెబ్బతీశాయి. ప్రపంచంలో, అత్యధికంగా భారత్పై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ఇందుల్లో 25 శాతం పరస్పర సుంకాలు కాగా, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు మరో 25 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ టారిఫ్ టెన్షన్ మధ్య, సెప్టెంబర్ 22న వాణిజ్య చర్చల కోసం వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ అమెరికా వెళ్తున్నారు. వాణిజ్య చర్చలకు కోసం అమెరికా వెళ్లే…
BJP: రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ముంబై నగర భద్రత కోసం ఒక ‘‘ఖాన్’’ నగర మేయర్ కాకూడదని ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి బీజేపీ ముంబై చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి పియూష్ గోయల్ హాజరైన బీజేపీ విజయ్ సంకల్ప్ మేళావాలో అమీత్ సతం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ముంబై సురక్షితంగా ఉంచడమే యుద్ధం. విదేశీ చొరబాట్లు పెరుగుతున్నాయి. వారు తమ రంగును మారుస్తున్నారు. కొన్ని నగరాల మేయర్ల ఇంటిపేర్లు చూడండి.…
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో సమావేశం అవుతారని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులను కలుసుకొని రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతుల విషయాలపై ప్రస్తావించారు. ఫలితంగా, కొత్త ప్రాజెక్టుల రాకతో పాటు అనుమతులు వేగంగా మంజూరు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు…
Piyush Goyal: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లండన్ లో నిర్వహించిన ఫ్యూచర్ ఫ్రాంటియర్ ఫోరమ్ లో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు (AI), భారత్ తీసుకుంటున్న విధానాలపై ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఆయన ‘‘మానవ మెదడు ఎప్పటికీ ఏ రకమైన కృత్రిమ మేధస్సుకన్నా గొప్పగానే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. అలాగే భారత్ తప్పకుండా AIని స్వీకరిస్తుందని, పనితీరు మెరుగుపరిచేందుకు దీన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటుందని…
Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు తేలడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు.
పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ హాజరయ్యారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ రాజధానిలో చేపట్టే పనులపై ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.
సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
యోగా డే సందర్బంగా విశాఖలో ప్రధాని మోడీ పర్యటన..! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించి, అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ జూన్ 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 వరకు విశాఖ ఆర్కే బీచ్…
నేడు ఏపీకి కేంద్రమంత్రి పీయూష్ గోయల్. పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు లంచ్ మీట్. లంచ్ తర్వాత గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి పీయూష్ గోయల్. రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో పీయూష్ గోయల్ సమీక్ష. నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న పొంగులేటి. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. బంగ్లాదేశ్…
Minister Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేడు (జూన్ 15) అమరావతికి రానున్నారు. రాష్ట్రానికి రానున్న ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి లంచ్ మీట్లో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి, కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించనట్టు తెలుస్తోంది. ఇక లంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతుల సమస్యలు, దిగుబడి ధరలు, మార్కెట్ పరిస్థితులు…