Piyush Goyal: AI కంటే మానవ మెదడు ఎప్పటికీ గొప్పదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piyush Goyal: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లండన్ లో నిర్వహించిన ఫ్యూచర్ ఫ్రాంటియర్ ఫోరమ్ లో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు (AI), భారత్ తీసుకుంటున్న విధానాలపై ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఆయన ‘‘మానవ మెదడు ఎప్పటికీ ఏ రకమైన కృత్రిమ మేధస్సుకన్నా గొప్పగానే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. అలాగే భారత్ తప్పకుండా AIని స్వీకరిస్తుందని, పనితీరు మెరుగుపరిచేందుకు దీన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇది ఉద్యోగాలు కోల్పోతారన్న పరిస్థితిని తీసుకరావడం మాకు ఆందోళనకరం కాదని ఆయన అన్నారు.
Also Read
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
మన దేశంలో ఉన్న ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటే.. డేటా రంగం, కొత్త అవకాశాలను డికోడ్ చేయడంలో ప్రపంచానికి భారత్ నుంచి సహాయపడే అవకాశాలు మరెన్నో ఉన్నాయి. అందుకే మన ప్రజలకు తిరిగి శిక్షణనివ్వడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన నేపథ్యంలో AIని స్వీకరించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. మానవ మెదడే AIని సృష్టించింది. అందుకే దానిని నియంత్రించగలిగేది కూడా మనమే. దీనిపై నాకు పూర్తి నమ్మకం ఉందని గోయల్ పునరుద్ఘాటించారు.
Read Also: Exclusive : తమిళ హీరోలకు తెలుగు దర్శకులు అలా.. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఇలా
బుధవారం నుండి ప్రారంభమైన రెండు రోజుల యూకే అధికారిక పర్యటనలో భాగంగా పీయూష్ గోయల్ భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గత వారాల్లో ఇద్దరు దేశాల ప్రధానమంత్రుల ద్వైపాక్షిక ప్రకటన అనంతరం, ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతకు దారితీసింది. అలాగే గురువారం యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్సచేక్యూర్ రాచెల్ రీవ్స్తో కూడా మంత్రి సమావేశమై, ఆర్థిక వ్యవస్థల సహకారం, సస్టెయినబుల్ ఫైనాన్స్, వాణిజ్య అవకాశాలపై చర్చించారు. మంత్రి పర్యటన భారత-యూకే మధ్య బలమైన ఆర్థిక, వాణిజ్య బంధాలను మరింత దృఢపరచడాన్ని లక్ష్యంగా చేసుకుని కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?