Payyavula Keshav: వైఎస్ జగన్.. అప్పుడు స్కాం కనిపించలేదా?
- ఐదేళ్ల పాలనలో 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు
- చేసిన అప్పులకి వడ్డీ చెల్లించేందుకే అప్పులు చేయాల్సి వస్తోంది
- అన్ని స్కాములు జరిగింది వైసీపీ హయాంలోనే
- ఏపీకి వైసీపీ హానికరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేతలు లిక్కర్ పాలసీ అక్రమం అంటున్నారు, ఇవాళ ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో ఉన్న మద్యం పాలసీనే అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజానీకానికి ఉచితంగా ఇసుక తోలుకోమని చెప్పింది తన ప్రభుత్వమే అని, వైసీపీ పాలనలో గ్రామ స్థాయి నుంచి తాడేపల్లి వరకు కప్పం కట్టారని ఎద్దేవా చేశారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్.. ఇలా అన్ని స్కాములు జరిగింది మీ హయాంలోనే అని మాజీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని, రూ.3.5 లక్షల కోట్లు బిల్లులు పెండింగ్లో పెట్టారని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు.
అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… ‘వైఎస్ జగన్ తన అస్తిత్వం కాపాడుకోవడానికి ఉన్నవి లేనివి చెబుతున్నాడు. అమరావతిపై విషం చిమ్మడానికి, అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మాటలు పరిశ్రమలు రాకూడదు అన్నట్లు ఉంది. మీడియా సమావేశం అంటే నాలుగు సలహాలు ఇస్తాడు అనుకున్నాం. లిక్కర్ పాలసీ అక్రమం అంటున్నారు, ఇవాళ ఉన్నది మీ నాన్న హయంలో ఉన్న మద్యం పాలసీనే జగన్. అప్పుడు స్కాం కనిపించ లేదా? జగన్. రాష్ట్ర ప్రజానీకానికి ఉచితంగా ఇసుక తోలుకోమని చెప్పింది మా ప్రభుత్వం. మీ పాలనలో గ్రామ స్థాయి నుంచి తాడేపల్లి వరకు కప్పం కట్టారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్ అన్ని స్కాములు జరిగింది మీ హయాంలోనే. రివర్స్ టెండరింగ్తో పోలవరం ఖర్చు మూడింతలయింది. జగన్కి ఎక్కడో భయం కలిగి ఈ మాటలు మాట్లాడుతున్నారు’ అని అన్నారు.
Also Read
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
Also Read: Murali Naik: తిరుచానూరు పద్మవతి అమ్మవారి కుంకుమతో వీరజవాన్ చిత్రపటం!
‘3.5 లక్షల ఎకరాలకు ఏ ఆధారం లేకుండా ఫ్రీ హోల్డ్ చేశారు. అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి. విశాఖను నాశనం చేశారు, పరిశ్రమలు తరిమేశారు. గతంలో మీరు చేసిన అరాచకాలు ఇంకా గుర్తు ఉన్నాయి. మా హయాంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అనంతపురం జిల్లాకు 22 వేల కోట్లతో రెన్యూ వచ్చింది. ఐదేళ్ల పాలనలో 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. రూ. 3.5 లక్షల కోట్లు బిల్లులు పెండింగ్లో పెట్టారు. 94 కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆపారు. మీరు చేసిన అప్పులకి వడ్డీ చెల్లించేందుకే అప్పులు చేయాల్సి వస్తోంది. రాజశేఖర్ రెడ్డి రూపాయికి ఎకరా భూమిని కట్టబెట్టారు. ఆరోజు ఇడ్లీ రూపాయికి వస్తుందా?. మీలాగా మూడు లక్షల ఎకరాలు కొట్టేయలేదు. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు తెరపైకి వస్తే మీ అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు గుర్తుకు వస్తాయి. మీ హయంలో లక్షకి పైగా పిల్లలు డ్రాప్ ఔట్ అయ్యారు. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం ఎలాగో.. ఏపీకి వైసీపీ కూడా అంతే హానికరం’ అని మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు.
- Tags
- ap
- Payyavula Keshav
- tdp
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!