సోషల్ మీడియా పెరిగిన తర్వాత రోజూ పలు రకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రకరకాల కాంబినేషన్స్ లో సినిమా అంటూ రూమర్స్ వింటూనే ఉన్నాం. అయితే వాటిలో కొన్ని కార్యరూపం దాల్చిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కువగా ఈ రూమర్స్ చెవులను తాకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి రూమర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో సినిమా అన్నదే ఆ…
పల్నాడు జిల్లా రెంటచింతలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని తెలిసి తాను తీవ్ర విచారానికి లోనైనట్టు తెలిపారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తున్న వీరు ప్రమాదవశాత్తు చనిపోవడం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రోజూవారీ కూలీపై ఆధారపడి జీవించే వారి కుటుంబాలను ప్రభుత్వం…
ఇటీవలె భీమ్లా నాయక్తో మాసివ్ హిట్ అందుకున్న పవర్ స్టార్.. అదే జోష్తో మరిన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. అయితే.. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ ఈ సినిమా రషెస్ చూసిన తర్వాత అసంతృప్తిగా ఉన్నాడని.. అందుకే ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ ఇచ్చాడని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు…
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో స్టేటస్ అనుభవిస్తున్న వారిలో.. ఎక్కువ మంది స్టార్ హీరోల వారసులే ఉన్నారు. మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని వారుసులుగా.. తరానికో స్టార్ హీరో వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో తరం వారసులు రెడీ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వారసులపైనే ఉంది. ఇప్పటికే వారి ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ల గురించి సోషల్ మీడియాలో…
బెజవాడలో ఇటీవల మెగా అభిమానులు నిర్వహించిన సమావేశం ఇది. ఒకప్పుడు ఫ్యాన్స్ మీటింగ్ అంటే.. చిరంజీవి చేపట్టే సేవా కార్యక్రమాలు.. సినిమాల చుట్టూ చర్చ జరిగేది. విజయవాడ సమావేశం మాత్రం పూర్తిగా రాజకీయ అజెండా చుట్టూ తిరిగింది. జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్రంగా జరిగిన ప్రసంగాలు.. ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో చర్చగా మారాయి. పవన్ కల్యాణ్ను సీఎంగా చూడాలని.. అందుకోసం పనిచేయాలని మెగా అభిమానులు తేల్చేశారు. అయితే ఇది వాళ్లకు వాళ్లుగా చేసిన కామెంటా లేక ఎవరైనా…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక అందులో ఒకటి భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శహకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. కోలీవుడ్ హిట్ సినిమా వేదాళం సినిరంకు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కనిపిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక…
పల్నాడు జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఘటన చాలా దురదృష్టకరమని.. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు అసాంఘిక, సంఘ విద్రోహుల కారణంగా హింసాత్మక ఘటనలు జరిగాయని కొడాలి నాని ఆరోపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. అమలాపురంలో పిల్లలను రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు చేశారు.…
టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపిండిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మే 27 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. దీంతో ప్రమోషన్ల జోరును పెంచేశారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఒక ఆసక్తికరమైన విషయాన్నీ…
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూలేనంతగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి. క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలామంది నేతలు శతవిధాలా చిచ్చు రగిలిస్తున్నారు. తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో, లేదంటే ఒక కులాన్ని రెచ్చగొట్టి, మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు. నిజాయితీగా ప్రజల జీవితాలు బాగుచెయ్యడానికి, వారీ జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం, అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలను చెప్పడం లేదు. కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్…