Nadendla Manohar: ముందస్తు కోసమే కోనసీమ కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళగిరిలో జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల తేవాలనే ఉద్దేశ్యంతోనే కోనసీమలో కుట్ర పన్నారన్నారు నాదెండ్ల.వచ్చే నెలలో పులివెందులలో పవన్ పర్యటన వుంటుందన్నారు.
ప్రభుత్వమే కోనసీమలో కులాల చిచ్చు పెట్టింది.కోనసీమ ఘటనపై ఇప్పటి వరకు సీఎం జగన్ స్పందించ లేదు.కోనసీమలో శాంతి నెలకొనాలనే అప్పీల్ కూడా చేయలేదు.ముందస్తు ఎన్నికలు తేలవాలనే వ్యూహంలో భాగంగానే కోనసీమ కుట్ర.కోనసీమలో అలజడి సృష్టించారు.ఇంటర్నెట్ కట్ చేశారు.. వర్క్ ఫ్రం హోం చేసుకోలేని పరిస్థితి.కోనసీమలో శాంతి నెలకొనాలని అందరికంటే ముందుగా స్పందించింది పవన్ కళ్యాణే.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
జనసేన కార్యకర్తలే కోనసీమ గొడవకు కారణమంటూ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది.తప్పు చేసిన వారిని శిక్షించండి.. తప్పు చేయని వారిని అరెస్టులు చేస్తే సహించం.కోనసీమ ఘటనలో తప్పుడు కేసుల నుంచి బయపడేసేందుకు జనసేన లీగల్ టీం ఏర్పాటు చేశాం.మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ ఇళ్లపై దాడి జరగడం బాధాకరం.జనసేన బలంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో పార్టీని బలహీన పర్చేందుకే కోనసీమ ఘటనలో జనసేనకు పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు.
జనసేన కార్యకర్తలపై బనాయిస్తున్న కేసుల విషయాన్ని వివరించేందుకు డీజీపీ వివరిస్తామంటే అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు.వచ్చే నెలలో కడప జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా పవన్ పర్యటించనున్నారు.జగన్ సీఎం అయ్యాక కడప జిల్లాలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.132 మంది కౌలు రైతుల్లో 13 మంది పులివెందుల నుంచే ఉన్నారు.కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా పులివెందులలోనే పవన్ సభ.
తల్లికి అన్నం పెట్టని వాడు.. పిన్నమ్మకు గాజులు చేయిస్తానన్నడటా అంటూ వైఎస్ పదే పదే చెబుతుంటారు.సొంత జిల్లాలో.. సొంత నియోజకవర్గంలో రైతులు చనిపోతున్న పట్టించుకోని సీఎం జగన్.. రాష్ట్రానికి ఏదో మేలు చేస్తానంటే నమ్మగలమా..?ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాం.ఇప్పటి వరకు 132 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన ఆర్థిక సాయం అందించింది. త్వరలోనే ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Atchannaidu : బొత్సకు వైన్ షాపుల సంఖ్య తప్ప పాఠశాలల సంఖ్య తెలుసా
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!