టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు ఓ రేంజ్లో ఫైరయ్యారు. అమలాపురం ఘటన దురదృష్టకరం, ఈ ఘటనను ఖండిస్తున్నాం అన్న మాట పవన్ నోటి నుంచి రాలేదని అంబటి ఆరోపించారు. ప్రభుత్వం ఉక్కుపాదంతో అల్లర్లను అణచివేయాలని పవన్ ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. దాడులను ఖండించకుండా పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోనసీమ జిల్లా మార్పు అంశంలో గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ వారు ఎందుకు నిరాహార దీక్షలు చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రజల నుంచి డిమాండ్…
అమలాపురం వ్యవహారంలో మంత్రుల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హోం మంత్రి వనిత మా పేరు వివాదంలోకి లాగారు. హోం మంత్రి వ్యాఖ్యలకు మేం ఆశ్చర్యపోతున్నాం. తల్లి పెంపకం సరిగా ఉండాలంటూ హోం మంత్రి కామెంట్ చేశారు. ఆరేళ్ల బిడ్డ కూడా అత్యాచారానికి గురైతే తల్లుల పెంపకమే తప్పా..? ఎస్సీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జగన్ ప్రభుత్వానిది. దళితులపై దాడులు జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెంబర్-1గా నిలిచిందని రామ్ దాస్ అథవాలే స్వయంగా…
జిల్లాల విభజన.. నామకరణ నేపథ్యంలో కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అన్ని జిల్లాలకు గతంలోనే పేర్లు పెట్టిన ప్రభుత్వం.. కోనసీమ జిల్లాకు పేరెందుకు పెట్టలేదు..?అన్ని జిల్లాలతో పాటు అదే రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టి ఉంటే ఇవాళ ఈ గొడవే ఉండేది కాదు.జిల్లాలకు మహనీయు పేర్లు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమే. జిల్లాలకు పేర్లు పెట్టడం అనేది కడపకు వైఎస్ పేరు పెట్టినప్పట్నుంచి…
కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో జరిగిన విధ్వంసం తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటన వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా… కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన, అన్ని పార్టీలు కోరాయన్న ఆయన.. అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్లే ఉన్నారు.. రాష్ట్రానికి విలన్ చంద్రబాబే అంటూ మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్, ఎన్టీఆర్,…
వైసీపీ పాలకులు ప్రజలకు ఎలాగూ రక్షణ ఇవ్వరు.. కనీసం పోలీసులైనా స్వతంత్రంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజకీయ బాసుల మాటకు తలొగ్గవద్దు. నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేం. కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఒప్పుకొన్న తరవాత కూడా…
పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ల ముద్దుల కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరడుగుల ఎత్తు, మెగా ఫ్యామిలీ గౌరవం, తండ్రి వ్యక్తిత్వం అన్ని పోత పోసినట్లు పెరుగుతున్నాడు అకీరా. తండ్రి దగ్గర లేనప్పటికీ తల్లి రేణు, కొడుకు ఇంట్రెస్ట్ ను తెలుసుకొని అతడికి ఇష్టమైన రంగంలో నడిపించడానికి కృషి చేస్తోంది. ఇక తాజాగా అకీరా తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన విషయం విదితమే. అకీరా లో కొన్ని హిడెన్…
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. గత కొంతకాలంగా ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కాగా.. టీడీపీ నేతలు కూడా పొత్తులకు సై అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ-బీజేపీ మధ్య మైత్రి ఉండగా.. ఎన్నికలలోపు ఏదైనా జరగొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. పొత్తులపై…
పవర్స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ మళ్లీ కలుసుకున్నారు. ఈ మేరకు వీరిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్, రేణుదేశాయ్ దంపతుల తనయుడు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సోమవారం ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూలులో అకీరా గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగినట్లు ఫోటోలను చూస్తే తెలుస్తోంది. Tollywood: హీరోల్లో మార్పు వస్తుందా..? బడ్జెట్స్ తగ్గుతాయా..? అకీరా…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రశాంత్ కిషోర్ ద్వారా కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ని కేసీఆర్ కలిశారు. తెలంగాణ అప్పు ఐదు లక్షల కోట్లు, ఇంకా రోజురోజుకి అప్పులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లోని వివిధ కార్మికుల యూనియన్స్ నాతో సమావేశమయ్యాయి. మేం ఢిల్లీ వెళ్లి వచ్చాక.. సీబీఐ విచారణ ప్రారంభం అయింది. డబ్బులు దాచుకోడానికి సీఎం, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. తెలంగాణలోని రైతులకు సహాయం ఎందుకు చేయరు.? ప్రశాంత్…