Pawan Kalyan Suffers With Back Pain at Machilipatnam Janavani: పవన్ కళ్యాణ్కు తీవ్రమైన వెన్నునొప్పి వేధిస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జనవాణి కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా క్లియర్ కాని సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తుంటారు సాధారణ జనం. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువలా…
పొలిటికల్ కరప్షన్ లేని జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని 2024లో తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో వచ్చేది జనసేన- టీడీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కనుక మేం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ సభలో ఈ సమస్యపై మాట్లాడుతాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇవాళ( మంగళవారం ) మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలుగు దేశం పార్టీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పొత్తు పెట్టుకుంటానన్న ప్రకటనపై బీజేపీ కోర్ కమిటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది
కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, నేడు( మంగళవారం ) మచిలీపట్నంలో జనసేన పార్టీ వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
బ్యానర్లు , ఫోటోలు వేసుకున్నంత మాత్రానా లీడర్లు అయిపోయాం అనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నాయకుడు ఏం చెబుతున్నాడో వినండి , దాన్ని ప్రచారం చేయండంటూ జనసేన నేతలకు ఆయన సూచించారు.
సన్నాసి అంటే తిట్టు కాదు.. ఏమి లేనివాడు అని అర్థమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీవాళ్లు ఆ మాటకు బాధపడితే భవిష్యత్లో ఆ మాట మాట్లాడను.. అది కూడా వారి ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు.