Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Donation Theft Case: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు న్యాయ సహాయం అందించబోమని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుల తరఫున ఎవరైనా న్యాయవాది కోర్టులో హాజరైతే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. సోమవారం జరిగిన సాధారణ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
భక్తుల మనోభావాల దృష్ట్యా నిర్ణయం
రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ కార్యదర్శి శైలేంద్ర జైస్వాల్ తెలిపారు. అందుకే నిందితుల తరఫున వాదించకూడదని సభ్యులంతా నిర్ణయించినట్లు వెల్లడించారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ట్రస్ట్ మాజీ ప్రతినిధులపై కూడా డిమాండ్
సమావేశంలో పలువురు న్యాయవాదులు శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్తో అనుబంధం ఉన్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు అయోధ్యను మూడు రోజుల్లో వీడాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే నగరాన్ని దిగ్బంధిస్తూ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఎనిమిది మంది నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో
అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ అలియాస్ తిన్నూ యాదవ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా రామమందిర విరాళాల నగదు, విలువైన వస్తువుల లెక్కింపులో పనిచేసిన వారేనని, విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై జూన్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు అధికారులు తెలిపారు.
విస్తరిస్తున్న దర్యాప్తు
కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే మాజీ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని ఇప్పటికే నమోదు చేసిన పోలీసులు, అవసరమైతే ఇతర ట్రస్ట్ ప్రతినిధుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!