మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ ప్లాప్ డైరెక్టర్ గా మెహర్ రమేష్ పేరు పొందాడు.ఈ దర్శకుడు మొదట కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ తో రెండు సినిమాలు చేసి మెప్పించాడు.ఆ సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే మెహర్ రమేష్ కన్నడలో చేసిన రెండు సినిమాలు కూడా తెలుగు రీమేక్ లే కావడం విశేషం. వాటిలో ఒకటి మహేష్ బాబు ఒక్కడు, రెండవది ఎన్టీఆర్ ఆంధ్రావాలా. 2008లో జూనియర్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతికి రానున్నారు. నేటి మధ్యాహ్నాం జనసేన పార్టీ విస్తృత స్థాయీ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఎన్నికలకు లీడర్లు, కేడరును సమాయత్తం చేస్తూ జనసేన ఈ సమావేశం నిర్వహిస్తుంది
దశాబ్ద కాలంలో బలిదానాల మీద గౌరవంతో సమస్యలను లేవనెత్తుతున్నామని... కానీ ఎక్కడ పోటీ చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పోటీలో ఉన్నామని ఆయన తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ను గెలిపించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.
ఎక్కడో చోట ఫెమస్ అయిన సెలెబ్రేటీలను బిగ్ బాస్ లోకి తీసుకొని వస్తున్నారు షో యాజమాన్యం… బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టి, మంచి ఫేమ్ ని సంపాదించుకొని, ఆ తర్వాత సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు.. గతంలో వచ్చిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు రతికా రోజ్ బాలయ్య బాబు…
వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు విసిరిన సవాలును టీడీపీ స్వీకరించింది. ఆర్యవైశ్యులకు ఎవరేం చేశారోననే దానిపై వచ్చే నెల 3వ తేదీన చర్చకు రావాలని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో, జగన్ ప్రభుత్వం ఏం చేసిందో వివరించటానికి తాము సిద్దమని, డిసెంబర్ 3న ఉదయం 11.30గంటలకు విజయవాడ వన్ టౌన్ లో కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చర్చకు రావాలని సవాల్ స్వీకరించారు. ‘దమ్ముంటే వెలంపల్లి శ్రీనివాసరావు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఛాలెంజ్ విసిరారు. ఆర్యవైశ్యులకు తాను ఏం అన్యాయం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని, టీడీపీ ఆపీస్కు రమ్మన్నా కూడా తాను సిద్ధమే అంటూ వెలంపల్లి సవాల్ చేశారు. ఆర్యవైశ్య సంఘాల ముసుగులో తనను ఇబ్బందిపెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య వైభవం కార్యక్రమం జరగకుండా మాజీమంత్రి వెల్లంపల్లి అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన…
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. నిజాంపేట్ హనుమాన్ ఆలయం కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ కార్నర్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్ అని అన్నారు.
RGV Says Barrelakka is Better than Pawan kalyan: ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేస్తూ వచ్చిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పంథా మార్చి వివాదాస్పద సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు టార్గెట్ గా వ్యూహం, శపదం అనే రెండు సినిమాలు చేసిన వర్మ వ్యూహం సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. అయితే ఆ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ…
కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలుపు కొరకు హుడా ట్రక్ పార్క్లో రేపు జరగబోయే విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి వెల్లడించారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొ్న్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి నేమురు శంకర్ గౌడ్ తరపున ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇంద్రచౌక్ లోని రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం... బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్నందున అని అన్నారు. బీసీలు సీఎం కావాలని తెలిపారు.