Pawan Kalyan Power Full Speech: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ (పాత పార్లమెంటు)లో ప్రారంభమైంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో నరేంద్ర మోదీ విజన్, నాయకత్వానికి సంబంధించి ప్రశంసలు కురిపించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేసిన పవన్ తన ప్రసంగంలో, 2014లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు 15…
బీజేపీ లాంటి పార్టీ తెలంగాణలో జనసేనతో పని చేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూకట్పల్లిలో అమిత్ షా వచ్చి ప్రచారం చేశారని.. బీజేపీకి క్యాడర్ లేక నేతలు లేక కాదు, జనసేనలో యువత కమిట్మెంట్ చూసి పార్టీని గుర్తించారన్నారు.
భారత దేశానికి స్వాతంత్య్రం రక్త పాతంతో వచ్చిందని.. సరదాగా సందడి చేస్తే రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండు దేశాలు విడిపోతున్న సమయంలో మతోన్మాదంతో ప్రజలను ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేసారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యోధులను జనసేన ఆదర్శంగా తీసుకుందన్నారు.
మనకి స్వాతంత్య్రం రావడానికి కొన్ని వేల రక్త తర్పణాలు జరిగాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వార్థం లేకుండా ఎంతో మంది చేసిన త్యాగమే స్వాతంత్ర్యమని ఆయన అన్నారు. మనకు స్వాతంత్య్రం ప్రశాంత వాతావరణంలో రాలేదని వెల్లడించారు.